Share News

Hyderabad: మియాపూర్ వివాదాస్పద ల్యాండ్‌లో డ్రోన్‌తో గస్తీ కాస్తున్న పోలీసులు..

ABN , Publish Date - Jun 23 , 2024 | 10:32 AM

హైదరాబాద్: మియాపూర్ హెచ్ఎండిఏ వివాదాస్పద ల్యాండ్‌లో పోలీసులు డ్రోన్‌తో గస్తీ కాస్తున్నారు. ల్యాండ్ చుట్టూ పక్కల ఏవరైనా ఆందోళన కారులు ఉన్నారా? లేరా? అని తెలుసుకుంటున్నారు. మరోవైపు పోలీసుల పహారా కొనసాగుతోంది. ఎవరూ ల్యాండ్ వద్దకు రాకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Hyderabad: మియాపూర్ వివాదాస్పద ల్యాండ్‌లో డ్రోన్‌తో గస్తీ కాస్తున్న పోలీసులు..

హైదరాబాద్: మియాపూర్ (Miyapur) హెచ్ఎండిఏ (HMDA) వివాదాస్పద ల్యాండ్‌లో పోలీసులు (Police) డ్రోన్‌ (Drone)తో గస్తీ కాస్తున్నారు. ల్యాండ్ చుట్టూ పక్కల ఏవరైనా ఆందోళన కారులు ఉన్నారా? లేరా? అని తెలుసుకుంటున్నారు. మరోవైపు పోలీసుల పహారా కొనసాగుతోంది. ఎవరూ ల్యాండ్ వద్దకు రాకుండా ఉండేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.

కాగా మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సంగీత, సీత, ఇంకా చాలామంది మహిళలను ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టారు.. స్థానిక ఫంక్షన్ హాల్స్‌లో మీటింగ్ ఏర్పాటు చేసి పేదలను రెచ్చగొట్టారు.. పేదలను రెచ్చగొట్టిన పది మందిపై కేసులు నమోదు చేశారు. సంగీత, సీత, సంతోష్ మరో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రెచ్చగొట్టి ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్ళూ రువ్విన వారిపై సైతం కేసులు నమోదు చేశారు.


కాగా మియాపూర్‌ శనివారం సాయంత్రం రణరంగంగా మారింది. పేదలు వర్సెస్‌ పోలీసులుగా మారడంతో ఉద్రిక్తత నెలకొన్నది. ఓ దశలో మహిళలు రాళ్లదాడికి దిగడంతో పోలీసులు ఉరుకులు, పరుగులు పెట్టారు. పారిపోయి తలదాచుకున్నారు. ఈ సంఘటనలో హుడా సైట్‌ ఆఫీసర్‌ రఘుకు ఛాతి మీద రాయి తగిలి స్వల్పంగా గాయమైంది. ఇద్దరు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. డీసీపీ వినీత్‌ ఆధ్వర్యంలో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. సీఎం లేదా కలెక్టర్‌ వస్తేనేగానీ కదిలేది లేదని భీష్మించారు. ఆ భూముల్లో రాత్రికి రాత్రే నిర్మించిన ఆలయం వద్ద దాదాపు రెండు వేల మందికి పైగా కూర్చున్నారు. అర్ధరాత్రి వరకు మహిళలెవరూ అక్కడి నుంచి కదలలేదు. పోలీసులు భారీగా చేరుకొని గస్తీ కాస్తున్నారు.


శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్‌ ప్రశాంత్‌నగర్‌, దీప్తిశ్రీనగర్‌, హెచ్‌ఎంటీ స్వర్ణపురి, మక్తా సరిహద్దులో సర్వేనెంబర్‌ 100, 101 పరిధిలో 550ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నెలరోజుల క్రితం ఈ భూమిలో కొందరు మహిళలు పాగా వేయడానికి ప్రయత్నించారు. క్రమంగా వందమంది స్థల కబ్జాకు ప్రయత్నించగా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేశారు. కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.


‘గుడిసె వేసుకుంటే ఇంటి జాగా’ అంటూ ప్రచారం

మియాపూర్‌లోని భూమిలో పాగా వేసేందుకు స్థానికంగా కొందరు దళారులు మహిళలను ఉసిగొల్పడంతో పాటు సోషల్‌ మీడియాలో ‘గుడిసె వేసుకుంటే హైదరాబాద్‌(Hyderabad)లో ఇంటి జాగా’ అంటూ ప్రచారానికి దిగారు. ఈ ప్రాంతంలో గజం భూమి ధర రూ.లక్ష పలుకుతుండడంతో ఒక్కో ఇంటి స్థలానికి కోటి రూపాయలు వస్తుందని ప్రచారం జరిగింది. ఇంత పెద్దమొత్తంలో వచ్చే భూమిని ఎందుకు వదిలేయాలని పేదలు భారీగానే తరలివచ్చారు. దాంతో యాబై.. వంద మందితో ప్రారంభమై ప్రస్తుతం రెండు వేలకు పైగా మహిళలు స్థల కబ్జాకు యత్నిస్తున్నారు. బంధువుల సమాచారంతో కొందరు పలు జిల్లాల నుంచి కూడా వచ్చారు. భారీగా తరలివచ్చిన మహిళలు రెండు గ్రూపులుగా ఏర్పడ్డాయి. ఓ గ్రూపు శుక్రవారం రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేయగా, మరో గ్రూపు ఆ భూముల్లో రాత్రికిరాత్రే గుడి నిర్మించి అక్కడే ఉండిపోయారు. శనివారం పెద్దఎత్తున వేలాదిగా తరలివచ్చిన పేదలతో హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చర్చించింది. వివాదంలో ఉన్న భూముల్లోకి రాకూడదని సర్దిచెప్పారు. అయినా పేదలు వినిపించుకోలేదు. తమ వెంట తెచ్చుకున్న కర్రలు, ప్లాస్టిక్‌ కవర్లు, చీరలతో డేరాలు వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలు రాళ్లతో దాడి చేయడంతో పోలీసులు తలోదిక్కున పరుగులు తీశారు. ఏవైపు నుంచి రాళ్లు వస్తున్నాయో తెలీక పోలీసులు పారిపోయి తలదాచుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళ హత్య కేసును 48 గంటల్లో చేధించిన పోలీసులు

రైతులకు రేవంత్‌రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్..

8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం

రెడ్ బుక్ అలర్ట్..! ఎవరు ముందు?

రాజీనామాకు సిద్ధమైన జగన్ అభిమాన అధికారులు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 23 , 2024 | 10:41 AM