Share News

Crime: మియాపూర్‌లో యువతిపై ఇద్దరు అత్యాచారయత్నం

ABN , Publish Date - Jul 03 , 2024 | 12:53 PM

హైదరాబాద్: మహిళల కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా.. దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్‌లో దారుణం జరిగింది. ఓ యువతిపై రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఇద్దరు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు.

Crime: మియాపూర్‌లో యువతిపై ఇద్దరు అత్యాచారయత్నం

హైదరాబాద్: మహిళల కోసం ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. పోలీసులు కఠిన చర్యలు చేపట్టినా.. దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మియాపూర్‌ (Miyapur)లో దారుణం జరిగింది. ఓ యువతిపై (Young Woman) రియల్ ఎస్టేట్ సేల్స్ కంపెనీకి చెందిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లు అత్యాచార యత్నానికి (Rape Attempt) పాల్పడ్డారు. ఉద్యోగం కోసం కడప నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె ఉప్పల్‌లో నివాసం ఉంటూ.. మియాపూర్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా పనిచేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్‌లు యువతికి సైట్ చూపిస్తామంటూ కారులో తీసుకెళ్లారు.


సైట్‌కు వెళ్లిన తర్వాత అక్కడ సంగారెడ్డి, జనార్దన్‌.. యువతిపై అత్యాచారానికి యత్నించారు. వారి బారి నుంచి తప్పించుకున్న యువతి, ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.... అక్కడి నుండి మియాపూర్‌కు కేసు బదిలీ చేశారు. సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉప్పాడలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం

సీఎం రేవంత్‌ రెడ్డితో జర్మనీ ప్రతినిధుల భేటీ

హత్రాస్ ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు..

ఏపీఎండీసీలో వైసీపీ దందా..!

అమరావతి రాజధానిపై నేడు శ్వేతపత్రం విడుదల

ఏపీలో పేదలకు ఇసుక ఉచితం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 03 , 2024 | 12:53 PM