TS News: మాదాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
ABN , Publish Date - Feb 15 , 2024 | 08:00 PM
నగరంలోని మాదాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు యువకులు బైక్పై మాదాపూర్ ఖానమెట్ వైపు నుంచి నోవాటెల్ హోటల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాక్ ప్రధాన ద్వారం వద్ద అతివేగంతో చెట్టును ద్విచక్ర వాహనం ఢీకొంది.
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు యువకులు బైక్పై మాదాపూర్ ఖానమెట్ వైపు నుంచి నోవాటెల్ హోటల్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాక్ ప్రధాన ద్వారం వద్ద అతివేగంతో చెట్టును ద్విచక్ర వాహనం ఢీకొంది.
ఈ ఘటనలో బైక్ నడుపుతున్న అజయ్(27) తీవ్ర రక్త స్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న శరత్ (25),అందే అజయ్(25) లకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. శరత్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వీరందరూ జగిత్యాల జిల్లాలోని కోరుట్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.