Share News

Group-1 Exam: గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్.. సుప్రీం సంచలన ఆదేశాలు..

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:35 PM

మరోవైపు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 బాధితుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంది. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో టీజీపీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మరికాసేపట్లో..

Group-1 Exam: గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్.. సుప్రీం సంచలన ఆదేశాలు..
Supreme Court

తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. మరికొద్ది గంటల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుత దశలో పరీక్షల నిర్వహణలో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇవాల్టి నుంచి ఈనెల 27వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీజీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మరోవైపు పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థులు జీవో 29పై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 బాధితుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను వాయిదా వేయలేమని పేర్కొంది. భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో టీజీపీఎస్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మరికాసేపట్లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2గంటలకు పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేదానిపై ఓవైపు పరీక్షలకు హాజరుకానున్న అభ్యర్థులతో పాటు.. వాయిదా కోరుతున్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్న వేళ.. న్యాయస్థానం తీర్పుతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు లైన్ క్లియర్ అయింది. జీవో29తో రిజర్వు అభ్యర్థులు నష్టపోతారని కొందరు గ్రూప్-1 అభ్యర్థులు చెబుతుండగా.. ఎవరికి ఎలాంటి నష్టం ఉండబోదని ప్రభుత్వం చెబుతున్న వూళ.. పరీక్షల నిర్వహణను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించగా.. కోర్టు పరీక్షల వాయిదాకు నిరాకరిస్తూ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.


పరీక్షల కోసం ఏర్పాట్లు..

తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ పూర్తి ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 పరీక్ష కేంద్రాలను టీజీపీఎస్సీ ఏర్పాటుచేసింది. అన్ని కేంద్రాల వద్ద ఏవిధమైన అవకతవకలు, అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు.


2011 తర్వాత..

2011 తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. దీంతో ఎలాంటి లోపాలు లేకుండా పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీలను ఏర్పాటు చేసింది. టీజీపీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ టీవీలను పర్యవేక్షించనుంది. పరీక్షల నిర్వహణలో ప్రతి షిఫ్ట్‌లో కచ్చితమైన నియమ నిబంధనలు పాటించేలా స్పష్టమైన మార్గదర్శకాలను అధికారులు జారీచేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ హాజరు తీసుకునేందుకై ప్రత్యేక సిబ్బందిని నియమించారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 21 , 2024 | 01:09 PM