Share News

TS Govt: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

ABN , Publish Date - Feb 23 , 2024 | 03:17 PM

Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులు (IAS Officers) బదిలీలు అవగా.. పలువురికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

TS Govt: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

హైదరాబాద్, ఫిబ్రవరి 23: తెలంగాణలో (Telangana) పలువురు ఐఏఎస్ అధికారులు (IAS Officers) బదిలీలు అవగా.. పలువురికి పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ సీఎస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇరిగేషన్ స్పెషల్ సెక్రెటరీగా ప్రశాంత్ పాటిల్, జనగాం కలెక్టర్‌గా రిజ్వన్ భాష షేక్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. సిద్దిపేట కలెక్టర్‌గా మను చౌదరి ఐఏఎస్ నియమితులయ్యారు. అలాగే జనగాం కలెక్టర్‌ శివలింగయ్యపై వేటు పడింది. జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యార్ ఐఏఎస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ias.jpg

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 23 , 2024 | 03:36 PM