Share News

Hyderabad: ఆటోలో ప్రయాణించిన కేంద్రమంత్రి.. ఆశ్చర్యపోయిన ప్రజలు..

ABN , Publish Date - Feb 24 , 2024 | 03:02 PM

హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా నగరానికి చేరుకున్నారు. ఉప్పల్ ప్రాంతంలో ఆయన ఆటోలో ప్రయాణించారు.

Hyderabad: ఆటోలో ప్రయాణించిన కేంద్రమంత్రి.. ఆశ్చర్యపోయిన ప్రజలు..

హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా నగరానికి చేరుకున్నారు. ఉప్పల్ ప్రాంతంలో ఆయన ఆటోలో ప్రయాణించారు. జనాలతో ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓ కేంద్రమంత్రి అయి ఉండి ఇలా సాధారణ ప్రయాణికుడిలా ఆటోలో ప్రయాణించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు.. బీజేపీ చేస్తున్నది విజయసంకల్ప యాత్ర కాదని అది విహారయాత్ర అని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధు సూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండునెలల కాలంలో నే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపరంగా సక్సెస్‌ అయ్యారని చెప్పారు. ప్రజలంతా రేవంత్‌ను హర్షిస్తుంటే బీజేపీ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2024 | 03:02 PM