Share News

Harsha Sai: హర్ష సాయిపై వాస్తవాలు బయటపెట్టిన బాధితురాలి లాయర్

ABN , Publish Date - Sep 26 , 2024 | 09:55 AM

హైదరాబాద్: యూట్యూబర్ హర్ష సాయిపై లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అతనిపై సెక్షన్ 376,,354, 328 కింద కేసు నమోదు చేశారు.

Harsha Sai: హర్ష సాయిపై వాస్తవాలు బయటపెట్టిన  బాధితురాలి లాయర్

హైదరాబాద్: యూట్యూబర్ (YouTuber) హర్ష సాయిపై (Harsha Sai) లైంగిక ఆరోపణల కేసు (Sexual Allegations Case)లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఓ మహిళ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అతనిపై సెక్షన్ 376,,354, 328 కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే బాధితురాలుకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. హర్ష సాయికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే న్యాయపరంగా పోరాటం చేస్తామని హర్ష సాయి తరపు న్యాయవాదులు చెబుతున్నారు. డబ్బుల కోసమే హర్ష సాయిపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. మరోవైపు ‘మెగా’ సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి లైంగికంగా వేధించారని బాధితరాలు తరఫు న్యాయవాది ఫిర్యాదు చేశారు.


హర్ష సాయి కేసులో అసలేం జరిగింది అనే దానిపై హర్ష సాయి బాధితురాలి లాయర్ నాగూర్ బాబు మాట్లాతూ.. వాస్తవాలు బయటపెట్టారు. బాధితురాలు హర్ష సాయిని హీరోగా పెట్టి నిర్మిస్తున్న ‘మెగా’ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారని, 2022లో ఒక సాంగ్ కోసం ఆమె తొలిసారి హర్ష సాయిని కలిశారన్నారు. ఆ సమయంలో తనకు మంచి ఫేమ్ ఉందని, తన వద్ద ఒక స్టోరీ కూడా ఉందని బాధితురాలికి చెప్పాడన్నారు. తన స్టోరీని సినిమా రూపంలో తీస్తే పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మబలికాడని అలా బాధితురాలు ‘మెగా’ మూవీని ఆమె సొంత డబ్బులతో ప్రారంభించారని న్యాయవాది వెల్లడించారు. అంతే కాకుండా స్క్రిప్ట్ డిస్కషన్ కోసం అప్పుడప్పుడు విల్లాకు రావాలి అని బాధితురాలిని హర్ష సాయి కోరగ, అతని మాటలు నమ్మి బాధితురాలు హర్ష సాయి ఉండే విల్లాకు వెళ్ళినప్పుడు ఆమెకు మత్తు మందు ఇచ్చి, ఆమె స్పృహలో లేనప్పుడు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడని.. అంతేకాకుండా వీడియో రికార్డ్ చేసి, మరుసటి రోజు ఆమెకు ఆ వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేశాడని న్యాయవాది తెలిపారు.


కాగా ‘మెగా’ సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ కోసం హర్ష సాయి తెగింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు బాధితురాలు ప్రొడ్యూసర్‌గా వ్యవరించగా.. కాపీ రైట్స్ విషయంపై ఇద్దరి మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో బాధితురాలికి మత్తు మందు ఇచ్చి హర్ష సాయి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి వీడియోలు హర్ష సాయి సీక్రెట్‌గా రికార్డు చేసినట్లు తెలిసింది. సినిమా కాపీ రైట్స్ ఇవ్వకుంటే వీడియోలు బయట పెడతానని హర్ష సాయి బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు సమాచారం.

కాగా.. మంగళవారం యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్వకేట్‌తో కలిసి నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హర్షసాయిపై కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితులు చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

ప్రేమ, పెళ్లి పేరుతో లొంగదీసుకుని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేశారని.. పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యూట్యూబర్‌పై 328, 376(2)(n)354(B)(C) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అయితే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయారు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్..

రెండు వేర్వేరు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాలు..

మక్కెలు విరగ్గొడతాం

పెళ్లి పేరుతో రేప్‌.. హత్య..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 26 , 2024 | 03:04 PM