Home » Case
రాజాభయ్యా చాలాకాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయాలున్నాయని తన ఫిర్యాదులో భన్విసింగ్ పేర్కొన్నారు. అత్తమామలు సైతం తనను వేధిస్తున్నారని చెప్పారు.
లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం విదేశీ ప్రతినిధులతో సమావేశం కావాల్సి ఉందని, ఆ కారణంగా విచారణకు హాజరుకాలేరని కోర్టుకు విన్నవించారు. అయితే, కోర్టు ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకాలేదు. రఘురామను అరెస్టు చేసి సీఐడీ ఆఫీస్కు తీసుకొచ్చిన సమయంలో సునీల్ నాయక్ అక్కడకు వచ్చారని ధృవీకరించారు. ఇప్పటికే నమోదు చేసిన వాంగ్మూలం ఆధారంగా ఆయన పాత్రపైనా విచారించేందుకు రావాలని కోరినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ప్రకాశం జిల్లా : నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీ గా పనిచేసిన సునీల్ నాయక్కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం విచారించనున్నారు. ఈ రోజు విచారణకు రావాలని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆయనకు నోటీసు ఇచ్చారు.
మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు ఇచ్చారు. సోమవారం ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు.
మాజీ మంత్రి హరీశ్రావుపై హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వైఎస్సార్సీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సీఐడీ అధికారులు పిటి వారెంట్ జారీ చేశారు. మంగళవారం కోర్టులో హాజరు పరచాలని థర్డ్ ఏసీఎం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మహారాష్ట్ర, తెలంగాణలో విజృంభించిన జీబీఎస్ వ్యాధి ఇప్పుడు ఏపీలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కేసులు క్రమక్రమంగా పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది. మరోవైపు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు మూడు మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు, వైద్యులు చెబుతున్నారు.
ఎంసీసీ ఉల్లంఘనల కింద 1,100 కేసులు నమోదు కాగా, 35,000 మందిని అరెస్టు చేసినట్టు శుక్రవారంనాడు ఒక అధికార ప్రకటన వెల్లడించింది. జనవరి 7వ తేదీన ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకూ ఈ కేసుల నమోదు, అరెస్టుల పర్వం చోటుచేసుకుంది.
మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం వ్యవహారంలో మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత హెచ్.రాజా(Senior BJP leader H. Raja)పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.