Share News

Irrigation AE: ఏసీబీకి చిక్కిన సాగునీటి పారుదల శాఖ ఏఈ

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:37 AM

బాలసముద్రం, ఆగస్టు 12: రూ.6వేలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్‌ ఏఈ గోపాల్‌ ఏసీబీకి పట్టుబడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.

Irrigation AE: ఏసీబీకి చిక్కిన సాగునీటి పారుదల శాఖ ఏఈ

బాలసముద్రం, ఆగస్టు 12: రూ.6వేలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్‌ ఏఈ గోపాల్‌ ఏసీబీకి పట్టుబడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంటతండాకు చెందిన బానోతు యాకు గతంలో రూ.1.27 లక్షలతో గ్రామంలో అభివృద్ధి పనులు చేశారు. అయితే, ఆ డబ్బును తిరిగి పొందే క్రమంలో... అక్కడ పంచాయతీ స్పెషల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇరిగేషన్‌ ఏఈ గుగులోతు గోపాల్‌, కౌంటర్‌ సైన్‌ చేసేందుకు రూ.6 వేలు డిమాండ్‌ చేశాడు.


ఏఈకి లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని యాకు... 9న ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చాడు. ఈమేరకు సోమవారం ఉదయం నక్కలగుట్టలోని ఎస్‌బీఐ బ్యాంకు ఎదుట బాధితుడు యాకు నుంచి డబ్బు తీసుకుంటుండగా గోపాల్‌ను పట్టుకున్నారు.

Updated Date - Aug 13 , 2024 | 04:37 AM