Home » Jangaon
మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలు గుమ్మడవెల్లి రేణుక అలియాస్ చైతు అలియాస్ భాను అంత్యక్రియలు సొంతూరు జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండిలో ముగిశాయి.
ఇది ప్రజా పాలన కాదని... అంతా దొంగల పాలన అయిందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. ఎండిన పంట పొలాలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం జనగామ జిల్లా, స్టేషన్ ఘనపూర్లో పర్యటించనున్నారు.ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 50 వేల మందితో శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
కరెంట్ షాక్ కొట్టిన తండ్రిని కాపాడి.. కుమారుడు అదే కరెంట్ షాక్తో చనిపోయాడు. జనగామ జిల్లా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. జనగామ డిపోలో ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్న బచ్చన్నపేటకు చెందిన సందెల వెంకటేశ్వర్లు..
యాసంగిలో సాగు చేసిన పంటలు తడి అందక ఎండిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లెదుటే ఇలా ఎండిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయతతో రైతుల గుండె మండుతోంది.
Jangaon police humanity: పోలీసులంటే కఠినంగా ఉండటమే కాదు.. అవసరమైనప్పుడు మానవత్వం చాటుకుంటారు అనే దానికి జనగామలో జరిగిన ఓ ఘటనే ఉదాహరణ. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి హాట్సాఫ్ పోలీస్ అనిపించుకున్నారు జనగామ పోలీసులు.
బ్యాంకులో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఇంటి గేట్లు ఎత్తుకెళ్లిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
నాలుగు పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా జనగామ జిల్లా ఎర్రకుంట తండాలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిపై రాళ్లు, కోడిగుడ్లు విసిరారు.
జనగామ జిల్లా కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంతో ఓ గిరిజన అభ్యర్థిని పరీక్ష రాసే అవకాశం కోల్పోయింది. కొడకండ్ల మండలం వాస్త్యా తండాకు చెందిన భూక్యా సునీత అనే బాలింత ఆదివారం జనగామలో పక్కపక్కనే ఉన్న రెండు పరీక్షా కేంద్రాల్లో ఒకటైన సెయింట్ మేరీ్సకు అరగంట ముందుగానే వెళ్లింది.
అగ్నిప్రమాదంలో తన కొడుకు బట్టల దుకాణం పూర్తిగా దగ్ధం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి గుండెపోటుతో మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగింది.