Share News

Mahabubabad District Court : గంజాయి రవాణా.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు

ABN , Publish Date - Jul 31 , 2024 | 05:20 AM

గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరికి మహబూబాబాద్‌ జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తండ ధర్మారానికి చెందిన బానోత్‌ కిరణ్‌కుమార్‌ అలియాస్‌ దేవా, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన బాదావత్‌ సూర్య..

Mahabubabad District Court : గంజాయి రవాణా.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు

డోర్నకల్‌, జూలై 30 : గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరికి మహబూబాబాద్‌ జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తండ ధర్మారానికి చెందిన బానోత్‌ కిరణ్‌కుమార్‌ అలియాస్‌ దేవా, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన బాదావత్‌ సూర్య.. ట్రాక్టర్‌లో గంజాయిని రవాణా చేస్తూ 2021 జూలై7న డోర్నకల్‌లో పట్టుబడ్డారు. వీరి వద్ద రూ.30 లక్షలు విలువ చేసే మూడు క్వింటాళ్ల గంజాయి దొరికింది. ఈ కేసులో విచారణ అధికారి, అప్పటి డోర్నకల్‌ సీఐ ఇస్లావత్‌ శ్రీనివా్‌సనాయక్‌ సాక్ష్యాన్ని తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్‌ నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Updated Date - Jul 31 , 2024 | 05:20 AM