Share News

MP Raghurami Reddy : కరోనావల్ల రద్దు చేసిన రైళ్లను మళ్లీ నడపాలి

ABN , Publish Date - Aug 14 , 2024 | 03:29 AM

కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లన్నింటినీ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్‌ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

 MP Raghurami Reddy : కరోనావల్ల రద్దు చేసిన రైళ్లను మళ్లీ నడపాలి

  • దక్షిణ మధ్య రైల్వే జీఎంతో ఎంపీ రఘురామిరెడ్డి భేటీ

కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లన్నింటినీ పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలని ఖమ్మం పార్లమెంట్‌ సభ్యుడు రామసహాయం రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

రైల్‌నిలయంలో దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌తో ఆయన సమావేశమైన సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చే ప్రయాణికులకు రైళ్లు అందుబాటులో ఉంచాలని కోరారు.

కరోనా కాలంలో బెల్గాం-భద్రాచలం రైలుతో పాటు పలు రైళ్లు రద్దు చేసినట్టు ఆయన గుర్తుచేశారు. అలాగే కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ వద్ద ఇరుకుగా మారిన దారిని విస్తరించేందుకు అనుమతించాలని కోరారు.

Updated Date - Aug 14 , 2024 | 03:29 AM