Share News

Kaleshwaram: పీసీ ఘోష్‌ కమిషన్‌ గడువు మరో 2 నెలలు పెంపు

ABN , Publish Date - Sep 01 , 2024 | 04:19 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌

Kaleshwaram: పీసీ ఘోష్‌ కమిషన్‌ గడువు మరో 2 నెలలు పెంపు

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. తాజా ఉత్తర్వుల ప్రకారం అక్టోబరు 31 తేదీలోగా నివేదిక అందించాలని కమిషన్‌ను ప్రభుత్వం కోరింది.

Updated Date - Sep 01 , 2024 | 04:19 AM