Share News

Telangana Express: నేడు 5గంటలు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌

ABN , Publish Date - Jun 14 , 2024 | 07:07 AM

నాంపల్లి నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌(Telangana Express) శుక్రవారం 5 గంటలు ఆలస్యంగా బయల్దేరుతుందని దక్షిణమధ్యరైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Telangana Express: నేడు 5గంటలు ఆలస్యంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌ సిటీ: నాంపల్లి నుంచి న్యూఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌(Telangana Express) శుక్రవారం 5 గంటలు ఆలస్యంగా బయల్దేరుతుందని దక్షిణమధ్యరైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలిపారు. ఉదయం 6 గంటలకు బయల్దేరాల్సి ఉండగా, 11 గంటలకు రీషెడ్యూలు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: విద్యుత్‌ స్తంభం ఎక్కి తాగుబోతు హల్‌చల్‌..


న్యూఢిల్లీ నుంచి నాంపల్లి(Nampally)కి గురువారం సాయంత్రం 5 గంటలకు రావాల్సిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ 7 గంటలు ఆలస్యంగా శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు చేరుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆలస్యం కావడానికి గల కారణాలపై ముఖ్య ప్రజా సంబంధాల అధికారి రాకేశ్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌ద్వారా ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 14 , 2024 | 07:07 AM