Share News

Heavy rains: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్

ABN , Publish Date - Sep 01 , 2024 | 12:13 PM

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారత వాతావరణ శాఖ ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్ తదితర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Heavy rains: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్

హైదరాబాద్, సెప్టెంబర్ 01: భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారత వాతావరణ శాఖ ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట్ తదితర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే కోమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌తోపాటు వివిధ జిల్లాలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతాయని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలలో ఇప్పటికే జాతీయ విపత్తు స్పందన దళాలు మోహరించాయి.

Also Read: Maha Vikas Aghadi: నేడు జోడి మారో ర్యాలీ.. స్పందించిన బీజేపీ


24 గంటల్లో వరదలు ముంచెత్తే జిల్లాలు ఇవి..

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, ఖమ్మం, కుమురం భీం, మహాబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ గ్రామీణం, వరంగల్ జిల్లాలో రానున్న 24 గంటల్లో భారీ వరదలు ముంచెత్తే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Also Read: Madhya Pradesh: రూ. 11 కోట్ల విలువైన యాపిల్ ఐఫోన్లు చోరీ


సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు పోటెత్తనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోతట్టి ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. భారీ వర్షాలతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మహానగరంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలకు సెప్టెంబర్ 2వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Also Read: Haryana Assembly Elections: బీజేపీపై గెలుపునకు కాంగ్రెస్ వినూత్న ప్రచారం


సీఎస్, డీజీపీ జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్..

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేంద్ర జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ విపత్తు స్పందన బృందాలు హైదరాబాద్‌లో సిద్దంగా ఉన్నాయని ఆ యా జిల్లాల ఉన్నతాధికారులకు తెలిపారు. నది పరివాహక జిల్లాల్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా అధికారులకు సూచించారు.

Also Read: Mumbai Police: ఇరికిద్దామనుకున్నారు... ఇరుక్కుపోయారు..


వాతావరణ కేంద్రం సూచనల నేపథ్యంలో ఎక్కడ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు వారు జాగ్రత్తలు చెప్పారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్, జీహెచ్ఎంసీ కార్యాలయంతోపాటు ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ శాంతి కుమార్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కారణంగా చిన్న పిల్లలు బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు సీఎస్ శాంతి కుమార్ సూచించారు.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 01 , 2024 | 12:14 PM