Share News

TG : ‘మేడిగడ్డ’లో డ్రోన్‌తో వీడియో.. కేటీఆర్‌పై కేసు

ABN , Publish Date - Aug 07 , 2024 | 05:01 AM

అనుమతి లేకుండా డ్రోన్‌తో మేడిగడ్డ బ్యారేజీ, గోదావరి ప్రవాహ దృశ్యాలను వీడియో, ఫొటోలు తీసిన ఘటనలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు భూపాలపల్లి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు మహదేవపూర్‌ పోలీసులు మంగళవారం తెలిపారు.

TG : ‘మేడిగడ్డ’లో డ్రోన్‌తో వీడియో.. కేటీఆర్‌పై కేసు

  • బాల్క సుమన్‌, గండ్ర వెంకటరమణారెడ్డిపైనా..

  • మహదేవపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌

మహదేవపూర్‌ రూరల్‌, ఆగస్టు 6: అనుమతి లేకుండా డ్రోన్‌తో మేడిగడ్డ బ్యారేజీ, గోదావరి ప్రవాహ దృశ్యాలను వీడియో, ఫొటోలు తీసిన ఘటనలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఆయనతో పాటు భూపాలపల్లి, చెన్నూరు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు మహదేవపూర్‌ పోలీసులు మంగళవారం తెలిపారు.

గత నెల 26న బీఆర్‌ఎస్‌ నాయకుల బృందం మేడిగడ్డలో పర్యటించింది. ఆ పర్యటనను అనుమతి లేకుండా డ్రోన్‌తో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడంపై నీటిపారుదల శాఖ అధికారులు గత నెల 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరుసటి రోజు సెక్షన్‌ బీఎన్‌ఎ్‌స 223(బీ) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. వారం రోజుల కిందటే కేసు నమోదు చేసినా.. పోలీసులు గోప్యంగా ఉంచడం చర్చనీయాంశమైంది. విషయం బయటకు పొక్కడంతో కేసు నమోదైనట్లు ధ్రువీకరించిన పోలీసులు.. ఎఫ్‌ఐఆర్‌ వివరాలను మాత్రం మీడియాకు ఇవ్వలేదు.

Updated Date - Aug 07 , 2024 | 05:01 AM