Share News

TG Govt: మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Apr 08 , 2024 | 09:29 PM

మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రత్యేకంగా దృష్టి సారించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో ఉన్న సబర్మతి నది తరహాలో తీర్చిదిద్దేలా ప్రణాళికలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల మూసీ నది సుందరీకరణపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే.

TG Govt: మూసీ అభివృద్ధిపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

హైదరాబాద్, ఏప్రిల్ 8: మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రత్యేకంగా దృష్టి సారించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో ఉన్న సబర్మతి నది తరహాలో తీర్చిదిద్దేలా ప్రణాళికలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ఇటీవల మూసీ నది సుందరీకరణపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే.


ఇందులో భాగంగానే ఈరోజు (సోమవారం) తెలంగాణ సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 24వ బోర్డు సమావేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయూడీ దానకిశోర్, ఎండీ హెచ్‌ఎండబ్ల్యూఎస్‌బీ సుదర్శన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఎండీ ఎంఆర్‌డీసీఎల్ ఆమ్రపాలి, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


ఈ సమావేవంలో మూసి అభివృద్ధికి సంబంధించి వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు 55 కి.మీ మేర మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యాలను నిర్దేశించారు. అన్ని వర్గాల ప్రజలకు అనువైన ఐకానిక్‌ డిజైన్‌ ఇందుకోసం ఎంపిక చేయాలని అధికారులకు సీఎస్ శాంతికుమారి సూచించారు.


మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ఉస్మాన్‌సాగర్‌ డ్యామ్‌ డౌన్‌స్ట్రీమ్‌ పాయింట్‌ నుంచి గౌరవెల్లి సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు, హిమాయత్‌సాగర్‌ డ్యామ్‌ డౌన్‌స్ట్రీమ్‌ పాయింట్‌ నుంచి బాపూఘాట్‌లో సంగమం పాయింట్‌ వరకు 55 కిలోమీటర్ల మేర మూసీ నది విస్తరణ ప్రతిపాదనపై బోర్డు చర్చించింది.


Breaking News: సీఎం రేవంత్‌ కాన్వాయ్‌లో.. ఒక్కసారిగా పేలిన కారు టైర్!

నగరంలోని మూసీ నది చుట్టూ ఉన్న వారసత్వ కట్టడాల రక్షణ, పునరుద్ధరణ, అభివృద్ధి ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఈ సమావేశంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ బోర్డు నిర్ణయించింది. ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. మూసీ రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీనిని పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు.


మూసీ ప్రాజెక్ట్‌పై పెట్టుబడిదారులు, వాటాదారుల విశ్వాసాన్ని పెంచడానికి మూసీ పరివాహక ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేసేలా కొన్ని ప్రాజెక్టులను గుర్తించాలని ఆమె అధికారులను కోరారు. నిపుణుల కమిటీ, సలహా కమిటీల ఏర్పాటుపై నిర్ధిష్ట ఉత్తర్వులతో రావాలని ఆమె అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. అనంతరం ఎండీ ఎంఆర్‌డీసీఎల్ ఆమ్రపాలి ప్రాజెక్ట్ అంశాలకు సంబంధిచి కొన్ని కీలక సూచనలు చేశారు.


ప్రాజెక్టులోని అన్ని అంశాల సాధ్యాసాధ్యాలు, గుర్తించబడిన పనుల డీపీఆర్‌లు, కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్లలకు మొదలైన విభాగాలకు ఈ సమావేశంలో టైమ్‌లైన్‌లు నిర్ణయించబడ్డాయని చెప్పారు. ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదా సిద్ధమవుతుందని ఆమె చెప్పారు. అనేక ప్రైవేట్‌ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని కనబరుస్తున్నాయని ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయూడీ దానకిశోర్ తెలిపారు.

BRS: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కోసం కేసీఆర్ కసరత్తు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం....

Updated Date - Apr 08 , 2024 | 09:29 PM