Share News

TPCC: కౌశిక్‌ రెడ్డికి మతి భ్రమించింది..

ABN , Publish Date - Sep 17 , 2024 | 01:31 PM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి(BRS MLA Padi Kaushik Reddy)కి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఇది సమాజానికి, రాజకీయ నాయకులకు మంచిది కాదని వెంటనే ఒళ్లు దగ్గర పెట్టుకొని రాజకీయం చేసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్‌(Gauri Satish) పేర్కొన్నారు.

TPCC: కౌశిక్‌ రెడ్డికి మతి భ్రమించింది..

హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి(BRS MLA Padi Kaushik Reddy)కి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఇది సమాజానికి, రాజకీయ నాయకులకు మంచిది కాదని వెంటనే ఒళ్లు దగ్గర పెట్టుకొని రాజకీయం చేసుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్‌(Gauri Satish) పేర్కొన్నారు. ఈ మేరకు గాంధీభవన్‌(Gandhi Bhavanలో ఏర్పాటు చేసిన నాయకుల సమీక్షా సమావేశంలో గౌరీసతీష్‌ మాట్లాడుతూ... పాడి కౌశిక్‌ రెడ్డి గతంలో కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశాడని ‘నీ స్థాయి ఏమిటో’ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు తెలుసని సతీష్‌ కుమార్‌ గుర్తుచేశారు.

ఇదికూడా చదవండి: Telangana DGP: ఏ సమయానికి నిమజ్జనాలు పూర్తవుతాయో చెప్పిన డీజీపీ


city7.2.jpg

గత జీహెచ్‌ఎంసీ(GHMC) ఎన్నికల్లో కార్పొరేటర్‌ టికెట్ల బీ-ఫామ్‌లను అమ్ముకున్న చరిత్ర మరిచిపోయావా కౌశిక్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌పై మాట్లాడే నైతికహక్కు, అర్హత లేదన్నారు. ’నీ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. వెంటనే ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు పొందాలి’ అని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Jani Master: జానీ మాస్టర్‌పై..లైంగిక దాడి కేసు

ఇదికూడా చదవండి: Rajagopal Reddy: పొద్దుగాల ఈ తాగుడేంది?

ఇదికూడా చదవండి: BRS: రేవంత్‌రెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం ..

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 17 , 2024 | 01:34 PM