CM Revanth: డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్

ABN, Publish Date - Sep 30 , 2024 | 01:29 PM

టెట్ తర్వాతనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(సోమవారం) ఉదయం 11 గంటలకు విడుదల చేశారు.

హైదరాబాద్: టెట్ తర్వాతనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈరోజు రాష్ట్ర సచివాలయంలో డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(సోమవారం) ఉదయం 11 గంటలకు విడుదల చేశారు.


నిరుద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ... విద్యాశాఖ అధికారులు అతి తక్కువ సమయంలో ఉద్యోగాల భర్తీకి కృషి చేశారని అన్నారు. వారికి అభినందనలు తెలిపారు. 26ఆప్షన్ కింద డీఎస్సీ నిర్వహించామని వివరించారు. 1:3ప్రాతిపాదికన ఫలితాల ప్రకటించిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. దసరా లోపే 9అక్టోబర్ నాడు ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated at - Sep 30 , 2024 | 01:29 PM