AP Politics: భూమా అఖిలప్రియ వర్సెస్ జగన్.. ముదురుతున్న వివాదం

ABN, Publish Date - Oct 17 , 2024 | 06:02 PM

కర్నూల్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె మామ జగన్ మోహన్ రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.

నంద్యాల: కర్నూల్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె మామ జగన్ మోహన్ రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ నేత భూమా అఖిలప్రియ నంద్యాలలో ఉన్న విజయ పాల డైరీ పరిశ్రమను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డైరీలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ ఫొటోలను తొలగించి, సీఎం చంద్రబాబు ఫొటోలను ఉంచారు. అనంతరం మామా కోడళ్ల మధ్య ఫోన్లోనే వాగ్వాదం జరిగింది. తాజాగా భూమా అఖిలప్రియ తన మామ జగన్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయ డైరీలో అక్రమాలు జరుగుతున్నాయని.. వాటిని త్వరలోనే బయటపెడతామన్నారు. మరిన్ని వివరాలు ఈ వీడియోలో...

Updated at - Oct 17 , 2024 | 06:02 PM