NBK Video: బస్సు నడిపి, టీడీపీ నేతల్లో జోష్ నింపిన బాలయ్య

ABN, Publish Date - Aug 16 , 2024 | 09:49 PM

రాజకీయాల్లో ఎప్పుడూ ప్రత్యేకత చాటుకునే బాలయ్య.. శుక్రవారం బస్సు నడిపి టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలకృష్ణ (Nadamuri Balakrishna) ప్రారంభించారు.

హిందూపురం: రాజకీయాల్లో ఎప్పుడూ ప్రత్యేకత చాటుకునే బాలయ్య.. శుక్రవారం బస్సు నడిపి టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే బాలకృష్ణ (Nadamuri Balakrishna) ప్రారంభించారు. అనంతరం ఆయన కాసేపు డ్రైవర్‌గా మారారు. స్టీరింగ్ పట్టి కొద్ది దూరం బస్సు నడిపారు. బాలకృష్ణ డ్రైవింగ్ చేయడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈలలు, కేరింతలతో హోరెత్తించారు. కాగా.. ఎన్నో రోజులుగా తీరని తమ కల బాలకృష్ణ ద్వారా నెరవేరిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త బస్సులు రావడంతో తమ సమస్యలు తీరినట్టేనని చెప్పారు. బస్సుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి ఎస్. సవిత పాల్గొన్నారు.

Updated at - Aug 16 , 2024 | 09:49 PM