Share News

CM Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 23 , 2025 | 06:01 PM

CM Chandrababu: సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. మార్చి 27వ తేదీన ఆయన పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ గురించి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ప్రాజెక్ట్ సైట్‌ను మరోసారి ఆయన సందర్శించనున్నారు.

CM Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు
CM Chandrababu

అమరావతి, మార్చి 23: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను మరోసారి సందర్శించనున్నారు. మార్చి 27వ తేదీ ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో సీఎం చంద్రబాబు పోలవరం చేరుకుంటారు. ఆ రోజు ఉదయం 11.00 గంటలకు ఆయన ప్రాజెక్ట్ సైట్‌కు చేరుకుంటారు. అనంతరం పోలవరం ప్రాజెక్ట్‌‌ను పరిశీలించి.. ప్రాజెక్ట్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 3.00 గంటలకు ఆయన పోలవరం ప్రాజెక్ట్ సైటును సందర్శించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.15 గంటకు విజయవాడకు సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక అదే రోజు.. అంటే గురువారం సాయంత్రం ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఆ తర్వాత ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకొనున్నారు.


కూటమి ప్రభుత్వం కోలువు తిరిన తర్వాత.. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం సైతం ఇతోధికంగా సాయం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ పురోగతిపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.


ఇక 2014-19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వం సైతం ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పనులను సమీక్ష నిర్వహించేది. దీంతో సోమవారాన్ని పోలవారంగా నాటి ప్రభుత్వం పరిగణించేది. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఎంత వరకు వచ్చిందంటే.. చెప్పే నాథుడే లేకుండా పోయారు.


ఆ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఇద్దరు జలవనరుల శాఖ మంత్రలు అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబులు మాటలకే పరిమితమైన సంగతి అందరికి తెలిసిందే. 2024 మే, జూన్ మాసంలో జరిగిన ఎన్నికల్లో కూటమికి రాష్ట్ర ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ క్రమంలో రాజధాని అమరావతి, పోలవరంప్రాజెక్ట్ పనుల వేగం పుంజుకున్నాయి.

ఇవి కూడా చదవండి..

Vidadala Rajini: ఆయనకు నాపై చాలా కోపం.. ఎందుకో తెలియదు

Viral News: శవయాత్రలో ఆశ్చర్యకర ఘటన..

KTR: కేటీఆర్ కాన్వాయ్‌లో అపశ్రుతి

IPL Uppal Stadium: ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల దందా.. రంగంలోకి పోలీసులు

For Andhrapradesh News And Telugu News

Updated Date - Mar 23 , 2025 | 06:09 PM