-
-
Home » Mukhyaamshalu » Latest Breaking News Watch Live Updates of Todays Top Stories of Thursday 19 02 2025 in Telugu News Siva
-

Breaking News: బంగ్లాను ఆదుకున్న ఆ ఒక్కడు
ABN , First Publish Date - Feb 20 , 2025 | 10:50 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.

Live News & Update
-
2025-02-20T18:27:11+05:30
బంగ్లాను ఆదుకున్న ఆ ఒక్కడు
ఛాంపియన్స్ ట్రోపీలో భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు
49.4 ఓవర్లలో228 పరుగులకు బంగ్లా ఆలౌట్
బంగ్లాను సెంచరీతో ఆదుకున్న తౌహిద్ హృదయ్
35 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
బంగ్లాను ఆదుకున్న జాకీర్ అలీ, తౌహిద్ హృదయ్
భారత్ విజయలక్ష్యం 229 పరుగులు
-
2025-02-20T13:53:22+05:30
ఏపీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ మార్పు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ మార్పు
ఈనెల 28న ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం
ఈనెల 24న ప్రారంభం కానున్న ఏపీ బడ్జెట్ సమావేశాలు
24వ తేదీన ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్
25వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
అదే రోజు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడనున్న సీఎం చంద్రబాబు
-
2025-02-20T13:29:19+05:30
కొత్త మార్పు చూడబోతున్నాం: సీఎం చంద్రబాబు..
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు
ఢిల్లీలో కొత్త మార్పును చూడబోతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఇక నుంచి ఢిల్లీ మరోలా ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి ఉండడం ఆనందంగా ఉందన్న చంద్రబాబు
ఇప్పుడు దేశ రాజధానిలో కొత్త శకం మొదలైందని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి
ఇకపై అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమం జరగబోతుందని చెప్పిన చంద్రబాబు
-
2025-02-20T13:23:06+05:30
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు, పవన్
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా
రేఖా గుప్తాతో ప్రమాణస్వీకారం చేయించిన లెప్టినెంట్ గవర్నర్
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన ఆశిష్ సూద్, మంజిన్డెర్ సింగ్ సిర్సా, రవీంద్ర రాజ్, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్
ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పర్వేష్ వర్మ
ప్రమాణస్వీకారానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, 20 రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు
ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
2025-02-20T11:37:34+05:30
సజ్జల దొరికిపోయినట్లేనా.. కబ్జా కేసులో కీలక పరిణామం..
కపడ: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్. వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణ ఎస్టేట్లో అటవీ భూముల కబ్జాపై మరోసారి సర్వేకి ఆదేశించింది ప్రభుత్వం.
కడప ఆర్డీఓ, డిఎఫ్ఓ నేత్రృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్ చెరుకూరి శ్రీధర్.
నేటినుండి సజ్జల ఎస్టేట్లో సర్వే నిర్వహించనున్న అధికారుల బృందం.
కడపనగర శివారులలో వున్న సజ్జల ఎస్టేట్లో 52.40 ఎకరాలు ఫారెస్ట్ భూములను ఆక్రమించినట్లు వెలుగులోకి తెచ్చిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.
-
2025-02-20T10:57:06+05:30
వంశీకి బిగ్ షాక్.. హైకోర్టు కీలక నిర్ణయం..
అమరావతి: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి హైకోర్టు షాక్ ఇచ్చింది.
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వేసిన పిటిషన్ను కొట్టేసింది.
బెయిల్ మంజూరు చేసేది లేదంటూ స్పష్టం చేసింది.
-
2025-02-20T10:53:18+05:30
మహాకుంభ మేళాకు వెళ్తున్నారా.. బిగ్ అప్డేట్ మీకోసమే..
ఏబీఎన్తో సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్వో శ్రీధర్.
ఢిల్లీ రైల్వేస్టేషన్ ఘటనతో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం.
కుంభమేళకు వెళ్లే భక్తులతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది.
ప్లాట్ ఫాంలపై రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
హైదరాబాద్ నుంచి కుంభమేళకు భారీగా భక్తులు తరలి వెళ్తున్నారు.
ప్రత్యేక రైళ్ళలో రిజర్వేషన్లన్నీ ఫుల్ అయ్యాయి.
రద్దీనిబట్టి రైళ్ల సర్వీసులను పెంచుతాం.
ప్రయాగరాజ్ కు 180 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాం.
మార్చ్ 1 వరకు ప్రత్యేక రైళ్ళు కొనసాగుతాయి.
-
2025-02-20T10:50:22+05:30
మంచిర్యాల: కవ్వాల్ టైగర్ జోన్ పై బీజేపీ ఎంపీ గొడం నగేష్ సంచలన వ్యాఖ్యలు.
టైగర్ జోన్ వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టైగర్ జోన్ ఏర్పాటుకు కారణమైన కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శలు చేయడం తగదు.
నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం మేరకే.. అప్పటి యూపీఏ ప్రభుత్వం 2012లో టైగర్ జోన్ను ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం ప్రజల ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ.
ప్రజలపై ప్రేమ ఉంటే కవ్వాల్ టైగర్ జోన్ను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం చేసి పంపాలి.
మేం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం.