Share News

Breaking News: బ్రాహ్మణి గురించి ఇంట్రస్టింగ్ వివరాలు చెప్పిన మంత్రి లోకేష్..

ABN , First Publish Date - Mar 08 , 2025 | 10:09 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: బ్రాహ్మణి గురించి ఇంట్రస్టింగ్ వివరాలు చెప్పిన మంత్రి లోకేష్..
Breaking News

Live News & Update

  • 2025-03-08T13:20:19+05:30

    ఇండియా టుడే కాంక్లేవ్‌లో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..

    • ఢిల్లీ: ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న ఏపీ ఐటి మంత్రి నారా లోకేష్.

    • విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము.

    • ఏపీ‌లో వాట్సప్ సేవలను తీసుకువచ్చా.

    • మనమిత్ర పథకం ద్వారా వాట్స్అప్ సేవలను ఏపీలో అందుబాటులోకి తీసుకువచ్చాము.

    • కుల ధ్రువపత్రాలు, హాల్ టికెట్స్, ఇతర పత్రాలు,ల్యాండ్ రికార్డ్స్ ఈజీగా వాట్సాప్ సేవలో పొందవచ్చు.

    • కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడ్వాంటేజ్.

    • టాటా పవర్ తో 7 గిగా వాట్స్ ఒప్పందం జరిగింది.

    • ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కి అందరూ సిద్ధంగా ఉండాలి.

    • మా రాష్ట్రంలో తెలుగును ప్రమోట్ చేస్తున్నాం.. స్థానిక భాష తెలుగు.

    • భాషను బలవంతంగా రుద్దుతారని నేను నమ్మను.

    • వివిధ భాషలు నేర్చుకోవడం అవసరం.

    • రెడ్ బుక్‌ను కొనసాగిస్తున్నాం.

    • ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడు దేశ ప్రగతిలో దోహదపడుతుంది.

    • వైసీపీ పాలనలో ఇసుక అక్రమ మైనింగ్ జరిగింది, సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది.

    • ఎన్డీఏకు మేము బేషరతుగా మద్దతు ఇస్తున్నాం.

    • హెచ్‌ఆర్‌డి శాఖ కావాలని నేను ఎంచుకున్నాను, దానిలో బలమైన టీచర్స్ యూనియన్ ఉన్నాయి.

    • నా భార్య నా క్రెడిట్ కార్డు బిల్లు పే చేస్తుంది.

    • మహిళా దినోత్సవం ఒక్క రోజు మాత్రమే కాదు.. ప్రతిరోజూ జరుపుకోవాలి.

    • చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడంతో హైదరాబాదులో 45,000 మంది ఐటి ఉద్యోగులు చంద్రబాబుకు మద్దతు తెలిపారు.

    • ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ ఇండియా గెలుస్తుంది.

  • 2025-03-08T12:18:29+05:30

    మధ్యాహ్నం ఈ ఏరియాలో కరెంట్ బంద్..

    విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్‌ తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

    పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • 2025-03-08T12:17:20+05:30

    బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు ఆత్మహత్య.

    • పెళ్లయిన నెల రోజులకే ఇంట్లో ఉరివేసుకొని చనిపోయిన గంట విజయ గౌరీ(20).

    • బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న యువతి.

    • గత నెల ఫిబ్రవరి 6న ఈశ్వర రావుతో వివాహం.

    • మృతురాలు స్వస్థలం విజయనగరం జిల్లా.

    • నిన్న రాత్రి బాల్ రెడ్డి నగర్ లో జరిగిన ఘటన.

    • ఇష్టం లేని పెళ్లి చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానం.

  • 2025-03-08T12:15:13+05:30

    మహిళా దినోత్సవం.. బీజేపీ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..

    • ఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.

    • ఢిల్లీలోని మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం కోసం మహిళా సమ్మాన్ పథకంపై నేడు ఢిల్లీ కేబినెట్‌లో చర్చ.

    • విధివిధానాలు అమలుపై నేడు చర్చ.

    • ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహిళలకు రూ. 2500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన బీజేపీ.

  • 2025-03-08T10:09:15+05:30

    రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం..

    • కడప : పులివెందులలో వాచ్‌మెన్ రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం చేస్తున్నారు వైద్యులు.

    • తిరుపతి నుంచి ఎఫ్ఎస్ఎల్ టీం నలుగురు.. కడపనుంచి 3 డాక్టర్లతో కూడినబృందం, ఫోరె న్సిక్ టీం సిబ్బంది వచ్చారు.

    • పులివెందుల తహసిల్దార్, వీఆర్వో, పోలీసు అధికారుల ఆధ్వ ర్యంలో సమాధి తవ్వకాలు నిర్వహించారు.