Share News

Breaking News: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ బందోబస్తు..

ABN , First Publish Date - Apr 26 , 2025 | 04:37 PM

Todays Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ బందోబస్తు..

Live News & Update

  • 2025-04-26T18:29:30+05:30

    బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీ బందోబస్తు..

    • ఆదివారం జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

    • బందోబస్తులో పాల్గొననున్న 1100 మందికి పైగా పోలీసులు.

    • ఇద్దరు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు, 28 మంది ఇన్స్‌స్పెక్టర్లు /ఆర్.ఐలు, 66 మంది ఎస్.ఐ లు, 137 ఏ.ఎస్.ఐ లు/ హెడ్ కానిస్టేబుళ్ళు,511కానిస్టేబుళ్ళు, 200 హోంగార్డ్స్‌తో పాటు డిస్ట్రిక్ట్ గార్డ్స్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

  • 2025-04-26T17:30:30+05:30

    ఇరిగేషన్ ENC హరీ రామ్ ఇంట్లో కొనసాగుతున్న ACB సోదాలు..

    • NDSA రిపోర్టు ఆధారంగా ఏసీబీ తనిఖీలు.

    • కాలేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన హరిరామ్.

    • ఉదయం 6 గంటల నుంచి కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు.

    • 11 గంటలుగా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.

    • ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు.

    • భారీగా ఆస్తులు కూడ పెట్టినట్లు గుర్తించిన అధికారులు.

    • కాలేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు.

    • నీటిపారుదల శాఖలో డిప్యూటీ ENC గా ఉన్న హరిరామ్ భార్య అనిత.

    • గజ్వేల్‌లో 30 ఎకరాల్లో ఫామ్ హౌస్, హైదరాబాద్‌లో లగ్జరీ ప్లాట్లు గుర్తించిన ఏసీబీ.

    • గజ్వేల్ నియోజకవర్గం మార్కుక్ ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు.

    • గజ్వేల్ నియోజకవర్గం మార్కూక్‌లో 30 నుంచి 100 ఎకరాల వరకు వ్యవసాయ భూమి గుర్తింపు.

  • 2025-04-26T17:26:00+05:30

    భారత్ సమ్మిట్‌లో ముగిసిన ప్లీనరీ

    • శంషాబాద్ ఎయిర్ పోర్ట్ బయల్దేరిన రాహుల్ గాంధీ

    • ఢిల్లీ వెళ్లనున్న రాహుల్ గాంధీ

  • 2025-04-26T16:37:25+05:30

    Bharat Summit: భారత్ సమ్మిట్‌కు హాజరైన రాహుల్‌ గాంధీ

    rahul gandhi.jpg

    • హైదరాబాద్‌ HICCలో రెండో రోజు భారత్ సమ్మిట్‌.

    • హాజరైన కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ.

    • పహల్గామ్‌ దాడి మృతులకు రాహుల్‌ నివాళులు.

    • భారత్ సమ్మిట్‌లో ప్రసంగించారు.

    • ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి.

    • పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేదు.

    • ఇప్పుడు అంతా మోడ్రన్‌ రాజకీయం నడుస్తోంది.

    • ప్రజాస్వామ్య రాజకీయాలు మారిపోతున్నాయి.

    • చట్ట సభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం రావట్లేదు.

    • మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు.

    • విపక్షాలను అణగదొక్కడమే పనిగా పెట్టుకున్నారు.

    • కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేశా.

    • భారత్‌ జోడో యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా.

    • విద్య, వైద్యం తదితర అంశాలపై నూతన పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఆసన్నమైంది.

    • విద్వేష రాజకీయాలను మార్చాలని అర్థం చేసుకున్నా.

    • విపక్ష పార్టీలు ప్రపంచ వ్యాప్తంగా అణచివేతకు గురవుతున్నాయని.

    • విపక్షాల వాదన వినిపించేందుకు.. కొత్త వేదికలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.

    • పాత తరం రాజకీయం అంతరించిపోయింది.

    • ఇప్పుడంతా కొత్తతరం రాజకీయం నడుస్తోంది.