Maharashtra Politics: మహారాష్ట్రలో వేడెక్కిన రాజకీయం
ABN , Publish Date - Mar 18 , 2025 | 08:22 PM
Maharashtra Politics: మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. గతేడాది నవంబర్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటరు మహా వికాస్ అఘాడీకి పట్టం కట్టారు. దీంతో ఆ కూటమికి 235 స్థానాలను కైవసం చేసుకుంది.

ముంబయి, మార్చి 18: అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ఏడాది కూడా కాకుండానే మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీజేపీలో చేరేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి.ఈ వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే మంగళవారం ముంబయిలో స్పందించారు. షిండే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాను ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యానని.. ఆ సమయంలో షిండే ఆక్కడ చెత్తబుట్టలో ఉండి ఉన్నారంటూ ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. 2022లో మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిన సమయానికి ముందు శివసేన పార్టీలో ఏకనాథ్ షిండే కేవలం చిన్న నాయకుడని ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు.
ప్రధాని మోదీకి ఠాక్రే క్షమాపణలు
శాసన మండలిలో డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే మాట్లాడుతూ.. న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సమావేశమయ్యారన్నారు. ఈ సందర్భగా బీజేపీతో తాము మళ్లీ కలవలనుకొంటున్నట్లు మోదీతో ఠాక్రే చెప్పారన్నారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే ముంబయి తిరిగి వచ్చిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారన్నారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన నేత అనిల్ పరబ్పై సైతం డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే కీలక ఆరోపణలు గుప్పించారు. నోటీసులు అందుకున్న అనిల్.. తానను కేసుల నుంచి తప్పిస్తే బీజేపీలో చేరతానంటూ రహస్య మంతనాలు జరుపుతూన్నారని విమర్శించారు.
ఠాక్రే ఎదురు దాడి
షిండే ఆరోపణలను థాకరే తీవ్రంగా ఖండించారు. షిండే తిరుగుబాటును సమర్థించుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అయినా గతంలో ఏమి జరిగిందో చెప్పే బదులు.. అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రానికి ఏం చేశారనే అంశంపై దృష్టి పెట్టాలంటూ షిండేకు హితవు పలికారు.
గతేడాది నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు..
మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. గతేడాది నవంబర్లో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటరు మహా వికాస్ అఘాడీకి పట్టం కట్టారు. దీంతో ఆ కూటమికి 235 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్. డిప్యూటీ సీఎంలుగా ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టారు. ఇక మహాయుతి కూటమి ఎన్సీపీ (శరద్ పవార్), కాంగ్రెస్ పార్టీ, శివసేన (ఉద్దవ్ వర్గం) ఈ ఎన్నికల్లో అతి తక్కవ సీట్లను గెలుచుకొంది.
ఇవి కూడా చదవండి:
Aadhar Link With Voter ID: ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్టెల్కు గట్టి సవాల్
For National News And Telugu News