చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ దాసరి వెంకటరమణకు సాహిత్య అకాడమీ అవార్డు
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:12 AM
చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ డాక్టర్ దాసరి వెంకటరమణకు అరుదైన గౌరవం దక్కింది. 2014లో ఆయన రాసిన ఆనందం అనే కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.

హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ డాక్టర్ దాసరి వెంకటరమణకు అరుదైన గౌరవం దక్కింది. 2014లో ఆయన రాసిన ఆనందం అనే కథల సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఇదే కథల సంపుటిని షోలాపూర్కు చెందిన బుధారం రేణుక ‘ఆనంద’ పేరుతో మరాఠీలోకి అనువాదం చేశారు. కథల సంపుటిలోని ఆనంద అనే మొదటి కథను మహారాష్ట్రలోని షోలాపూర్ విశ్వవిద్యాలయంలో బీఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ ఏడాది ఎంపిక చేశారు.
ఈ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ఇటీవల 24 భారతీయ భాషల్లోకి కూడా అనువదించినట్లు డాక్టర్ దాసరి వెంకటరమణ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈయన రచించిన వేగుచుక్క అనే కథను 12వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా, పల్లెకు పోదాం అనే కథను 8వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది. వెంటరమణ ఇటీవలే చందమామ కథలు, వ్యక్తిత్వ వికాసం అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News