Share News

Minister Seethakka: నా ఫొటోలు మార్ఫింగ్ చేశారు.. ఇక వదిలేది లేదంటూ మంత్రి మాస్ వార్నింగ్..

ABN , Publish Date - Mar 15 , 2025 | 05:28 PM

సోషల్ మీడియా దుష్ప్రచారం గురించి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం తామందరికీ రిలీఫ్ అనిపించిందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు రాజకీయాల్లో ఎదగడమే చాలా కష్టమని, అలాంటిది తాము ఈస్థాయికి వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహించారు.

 Minister Seethakka: నా ఫొటోలు మార్ఫింగ్ చేశారు.. ఇక వదిలేది లేదంటూ మంత్రి మాస్ వార్నింగ్..
Minister Seethakka

హైదరాబాద్: సోషల్ మీడియా(Social Media)లో తన ఫొటోలు మార్ఫింగ్(Photo morphing) చేసి మానసిక క్షోభకు గురి చేశారంటూ మంత్రి సీతక్క (Minister Seethakka) ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాన్నీ కొంతమంది దుర్మార్గులు తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వల్ల తాను కుమిలిపోయానని, దాన్ని కట్టడించడం చాలా అవసరమని అన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, దాంతో తాను డీ మోరల్ అయినట్లు సీతక్క వెల్లడించారు. సోషల్ మీడియాను బీఆర్ఎస్ అబద్ధాల ప్రచారానికి వాడుతోందని, అది కుటుంబాలను బజారుకీడుస్తోందని మండిపడ్డారు.


సోషల్ మీడియా దుష్ప్రచారం గురించి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం తామందరికీ రిలీఫ్ అనిపించిందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు రాజకీయాల్లో ఎదగడమే చాలా కష్టమని, అలాంటిది తాము ఈస్థాయికి వస్తే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహించారు. సోషల్ మీడియాను సోషల్ సర్వీస్‌కు వాడుకున్న తానూ అందరిలాగానే ఇబ్బందులకు గురైనట్లు చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో ఎంతో సర్వీస్ చేశానని, దానిపైనా సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శించారంటూ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.


బాడీ షేమింగ్, ఫొటోలు మార్ఫింగ్, అనని మాటలు అన్నట్లుగా చూపిస్తున్నారని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారం చేపటిన నాటి నుంచి మాపై ఈ దాడులు మరీ ఎక్కువైపోయాయంటూ ఆరోపించారు. అన్నాచెల్లెళ్లు చేతిలో చెయ్యి వేసుకున్నా మరోరకంగా చూపుతున్నారని మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాను మంచికి వాడాలే తప్ప చెడుకు కాదంటూ హితవు పలికారు. అబద్ధాలపైనే బీఆర్ఎస్ నడుస్తోందని, ఏ రోజుకైనా నిజమే గెలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా బురద చల్లుతున్నారని, కడుక్కోవడం తమ వంతు అవుతోందంటూ మంత్రి సీతక్క చెప్పారు.


రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..

కాగా, సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టుల ముసుగులో అసాంఘిక భాష వాడితే ఊరుకునేది లేదంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇలాంటి భాషా ప్రయోగాన్ని తెలంగాణలో ఎప్పుడూ చూడలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. నోటికి వచ్చింది మాట్లాడి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహించారు రేవంత్ రెడ్డి. జర్నలిస్టులకు సైతం విధివిధానాలు రూపొందిస్తామని, అవసరమైతే ప్రత్యేక చట్టాలు తయారు చేస్తామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతలు ఆత్మగౌరవం చంపుకుని దిగజారుడు రాజకీయాలు చేయరంటూ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి సంప్రదాయం ఎప్పుడూ లేదని, భవిష్యత్‌లో ఇలాగే తప్పుగా మాట్లాడితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu Naidu: రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..

Warangal: దారుణం.. పెట్రోల్ పోసుకుని ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం..

Updated Date - Mar 15 , 2025 | 05:29 PM