Home » TG Politics
రాష్ట్రంలో సక్రమంగా విద్యుత్తు సరఫరా చేయించడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చేతకావడంలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు విద్యుత్తు ఉద్యోగులపై నిందలు మోపుతూ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యుత్తు ఉద్యోగులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, తాము చెబితేనే కరెంటు కోతలకు పాల్పడుతున్నారంటూ సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం తగదని హితవు పలికారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో బుధవారం ఆ మూడు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశమయ్యారు.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో సీఎం రేవంత్రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. ధాన్యం కొనుగోళ్లు, పంట రుణాల మాఫీ వంటి అంశాలపై బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇక వంద శాతం పాలనపైనే దృష్టి పెడతానంటూ మీడియాతో చిట్చాట్ సందర్భంగా రేవంత్రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇందు లో భాగంగానే రైతులకు సంబంధించి తక్షణ సమస్యగా ఉన్న ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష చేశారు.
రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం తెలంగాణ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఏపీలో ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్లతో సఖ్యతగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. అంతా పాజిటివ్ థింకింగ్ మాత్రమే.. నో నెగెటివ్ థింకింగ్ అని చెప్పారు. తన ప్రపంచం అంతా తెలంగాణనే అని అన్నారు. వంద సంవత్సరాలకు కావాల్సిన ప్రణాళిక అందించడమే తన లక్ష్యమని తెలిపారు.
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని.. ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. మంగళవారం గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల్లో తాము అధికారంలో ఉన్నాం కదా అని ఎవరికి ఇబ్బంది కలిగేంచేలా ప్రవర్తించలేదని చెప్పారు.
రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ ముగిసింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన త్రిముఖ పోరులో విజయం ఎవరిదనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది. మూడు పార్టీలూ ఫలితాల పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని, గత నవంబరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదృష్టం కాదని నిరూపిస్తామని కాంగ్రెస్ ధీమాగా చెబుతోంది. సోమవారం సొంత గ్రామంలో ఓటేసిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని పునరుద్ఘాటించారు.
తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) తెలిపారు. ఈమేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అదనపు డీజీపీలు మహేష్ ఎం భగవత్, సంజయ్ కుమార్ జైన్లు డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ సెంటర్ను స్వయంగా పర్యవేక్షించారని తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Election 2024) తమ పార్టీకి అద్భుతమైన ఫలితాలు వస్తాయని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన అనంతరం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లు,తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా.. నేడు (సోమవారం) పలుచోట్ల భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని, దీన్ని దృస్టిలో ఉంచుకొని పోలింగ్ ప్రక్రియకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని సీఈవో వికా్సరాజ్ను కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ కోరారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ.వెయ్యి, హాఫ్ బాటిల్ మద్యం పంపిణీ చేస్తుంటే ఎన్నికల సంఘం అధికారులు ఏం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రశ్నించారు.