హైడ్రా పేరుతో సెటిల్మెంట్లు చేస్తే ఊరుకోను..రంగనాథ్ మాస్ వార్నింగ్
ABN, Publish Date - Mar 24 , 2025 | 03:39 PM
హైడ్రా పేరుతో ఇక సెటిల్మెంట్లు చేస్తే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వంశీరామ్ బిల్డర్స్పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఫిర్యాదు అందిందని తెలిపారు.

హైదరాబాద్: హైడ్రా పేరుతో ఇక సెటిల్మెంట్లు చేస్తే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వంశీరామ్ బిల్డర్స్పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ విషయంపై చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ఒక్క వంశీరామ్ బిల్డర్స్ మాత్రమే గాకుండా, రాజ్పుష్ప వంటి బిల్డర్స్కు కూడా బఫర్ జోన్లలో డంపింగ్ చేశారని రంగనాధ్ తెలిపారు.
వారందరికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. హై డ్రా పేరుతో సెటిల్ మెంట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయని అలాంటి అధికారులు ఉంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు.
మరిన్ని ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి...
Nagpur Riots Latest Update: నాగ్పూర్ అల్లర్లలో నిందితుడిపై మహా సర్కార్ రియాక్షన్ ఇదీ..
Loan Repayment Tips: ఇలా చేయకపోతే... అప్పుల్లో తలనొప్పులు ఖాయం
Read Latest Telangana News And Telugu News
Updated at - Mar 24 , 2025 | 03:40 PM