Home » Anantapur urban
తన భూమిని వెంకటరాముడు అనే వ్యక్తి ఆనలైన చేయించుకుని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని కనగానపల్లి మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన దళిత వృద్ధురాలు పెద్దక్క ఆర్డీఓ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.
పంచాయతీ పరిధిలోని ముస్లిం మైనార్టీ కాలనీలో అనాథాశ్రమం (ఆల్ పైగా- మే గరీబ్ నవాజ్ మదర్సా) కబ్జా కాకుండా కాపాడాలని కాలనీ వాసులు మున్నా, అబ్దుల్ రహీమ్, మహబుబ్ బాషా, ఇబ్రహీం, ఇర్షాద్, మహమ్మద్బాషా, షేక్షావలి కోరారు.
వ్యవసాయ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఎంపీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావును ఆ సంఘం నాయకులు కోరారు. సోమవారం విజయవాడలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్లో ఢిల్లీరావును ఎంపీఈఓల సంఘం రాయలసీమ జోన అధ్యక్షుడు రెడ్డి ప్రసాద్, నాయకులు శంకర్, భాస్కర్ నాయక్ వినతి పత్రం అందజేశారు.
భగవాన వ్యాస మహర్షి జయంతి వేడుకలను ఆదివారం మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు, దత్తాత్రేయ స్వామి విగ్రహాలకు వేదపండితుడు సుంకేశుల సత్యనారాయణశర్మ, ఆలయ అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలో బ్రాహ్మణ వేదపాఠశాల విద్యార్థులతో అభిషేకాలు, వేదపఠనం చేశారు.
రక్తదానం చేయండి...ప్రాణదాతలు కండని యువత పిలుపునిచ్చింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మై గవర్నమెంట్, డిజిటల్ ఇండియా ప్రోగ్రాం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతిపథం యూత అసోసియేషన, ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రెడ్క్రాస్ సొసైటీలో రక్తదానశిబిరం నిర్వహించారు.
గురువులకు గురువైన సాయినాథుడిని స్మరించుకుంటూ ఆదివారం జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి సంబరాలు అంబరాన్నంటాయి. ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తడంతోపాటు సాయినామస్మరణతో భక్తిపారవశ్యం పొందారు.
వినుకొండలో వ్యక్తిగతంగా జరిగిన హత్యపై జగనమోహనరెడ్డి రాజకీయరంగు పులిమి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బంగి నాగ మండిపడ్డారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు.
సద్గురు సాయినాథుని జయంతి గురుపూర్ణిమ వేడుకలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు సాయిమందిరాల్లో రెండురోజుల క్రితం నుంచే సంబరాలను ప్రారంభించారు. సాయిసచ్ఛరిత్ర పారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నగరోత్సవాలు నిర్వహించారు. గురుపౌర్ణమి నేపథ్యంలో ఆదివారం నిర్వహించనున్న వేడుకలకు ఇప్పటికే ఆలయాలన్నింటినీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు.