Home » Anantapur urban
తాగునీటి పథకాల ద్వారా అంతరా యం లేకుండా తాగునీటి సరఫరాకు తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలిక కమిషనర్ మేఘస్వరూప్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగునీటి పథకం, ఆర్డబ్ల్యూఎస్ పథకాలపై ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
శిల్పారామానికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉదయం రాజీవ్కాలనీ పంచాయతీలోని శిల్పారామాన్ని ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలియతిరిగారు. పార్కులోని ప్రతి ఒక్కటి పరిశీలించారు. టాయిలెట్లు, నీటి సౌకర్యం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒకరికి మనం చెప్పేటపుడు, మనం కాస్తోకూస్తో ఆదర్శంగా ఉంటూ వాటిని పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మనం చెప్పేవాటిని ఎదుటివారు పాటిస్తారు. అలాకాకుండా మనం ఇష్టమెచ్చినట్లు వ్యవహరిస్తూ ఇతరులకు నీతిసూత్రాలు చెబితే అందరూ చులకనచేస్తూ నవ్వుతారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు వీకే ఆదినారాయణ రెడ్డి స్ఫూర్తిదాయకుడని సీపీఐ నాయకులు కొనియాడారు. గురువారం ఆయన 27వ వర్ధంతిని ఘనంగా చేశారు. నగరంలోని మహాదేవ్నగర్లో ఆయన స్మారక స్థూపం వద్ద సీపీఐ నాయకులు నివాళులర్పించారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ పిలుపునిచ్చారు. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించన కార్యక్రమానికి ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్రప్రధానకార్యదర్శి భవానీ రవికుమార్, రాయలసీమ మహిళా విభాగం కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మండలంలోని నారాయణపురం పంచాయతీని కార్పొరేషనలో విలీనం చేస్తామని ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. గురువారం మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ ఏఎ్సఆర్ నగర్లో పీర్ల మకాన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతపురం అర్బనలో వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలపై జాయింట్ కలెక్టర్తో విచారణ చేయించి, తగు చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ వినోద్కుమార్ను కలిసి వైసీపీ ఐదేళ్ల పాలనలో అనంత అర్బనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆయన ఫిర్యాదు చేశారు.
మొహరం పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లావ్యాప్తంగా హిందూ, ముస్లింలు వేడుకను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మహిళా క్రికెట్ పోటీల్లో పలు జట్లు విజయం సాధించాయి. బుధవారం స్థానిక అనంత క్రీడాగ్రామంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన, జిల్లా క్రికెట్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సీనియర్ మహిళా అంతర్ జోనల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు.
జాషువా సాహిత్య పీఠం ఆధ్వర్యంలో 24వ తేదీన నిర్వహించనున్న జాషువా 53 వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పీఠం ప్రధాన కార్యదర్శి నాగలింగయ్య పిలుపునిచ్చారు. బుధవారం విశాలాంధ్ర బుక్హౌ్సలో జాషువా వర్దంతి బ్రోచర్లను ఆవిష్కరించారు.