Home » AP Congress
మాజీ మంత్రి వివేకానందారెడ్డి వ్యక్తిగత జీవితంపై దుర్మార్గంగా మాట్లాడటం తగదని, చనిపోయిన వ్యక్తి, సంజాయిషీ ఇవ్వలేని వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) హెచ్చరించారు. వైసీపీ మూకలకు మళ్లీ చెబుతున్న వివేక పర్సనల్ లైఫ్ని టార్గెట్గా చేసి మాట్లాడడం మానుకోవాలని మందలించారు.
ప్రత్యేక హోదాను సీఎం జగన్రెడ్డి (CM Jagan) కనుమరుగు చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. గురువారం నాడు శింగనమల నియోజకవర్గంలోని నార్పలలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం జగన్రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఒక చేత్తో పథకాలు ఇచ్చి ..మరో చేతితో జగన్ గుంజుకుంటున్నారని విమర్శించారు.
మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి జై భీమ్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి (Dastagiri) కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), కాంగ్రెస్ చీఫ్ షర్మిల (YS Sharmila), వివేకా కూతురు సునీతారెడ్డి వాడుకుంటున్నారని సోమవారం నాడు ఎలక్షన్ కమిషన్ (Election Commission)కి దస్తగిరి ఫిర్యాదు చేశారు.
వైసీపీ (YSRCP) పాలనలో ఏపీలో హత్యలు, దోపిడీలు పెరిగిపోయాయని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల (Sharmila) ఆరోపించారు. కాంగ్రెస్ చేపట్టిన ఏపీ ‘న్యాయ యాత్ర’లో భాగంగా ఆదివారం నాడు కమలాపురం నియోజకవర్గంలో పర్యటించారు. పెండ్లిమర్రి మండలం, నందిమండలం గ్రామంలో షర్మిలకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.
వైఎస్సార్సీపీ చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా (Vunnamatla Eliza) ఆదివారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో చేరిన తర్వాత వైసీపీ, సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీకి రాజీనామా చేశా.. తన రాజీనామా లేఖను అధినేత జగన్ రెడ్డికి పంపించానని తెలిపారు. వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరానని అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేక పోయానని అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల (YS Sharmila) ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నేడు వీడనుంది. ఇవాళ ఉదయం విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లా నేతలతో షర్మిల సమావేశం కానున్నారు.
YS Sharmila Kadapa MP Candidate: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిణామాలు (AP Politics) శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇప్పటికే వైసీపీ (YSR Congress), టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) కూటమి అభ్యర్థులను దాదాపు ప్రకటించేయగా.. కాంగ్రెస్ (Congress) మాత్రం పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. అయితే ..
లాభాల్లో నడుస్తున్న ఉక్కు కర్మాగారం అమ్మకానికి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి (Raghuveera Reddy) అన్నారు. శనివారం నాడు కాంగ్రెస్ న్యాయ సాధన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దీన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్ రెడ్డి గంగవరం పోర్టును అదానీ పాలు చేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. శనివారం నాడు విశాఖలో జరిగిన ‘సేవ్ విశాఖ-సేవ్ స్టీల్ ప్లాంట్’ సభలో షర్మిల మాట్లాడుతూ.. కేవలం భూముల కోసం విశాఖ స్టీల్ ఫ్లాంట్ను కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు కలిసి నష్టాల్లోకి తీసుకెళ్లారని మండిపడ్డారు.
Andhrapradesh: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (శనివారం) ఏపీలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి రేవంత్ ఆంధ్రాలో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. తొలిసారి ఏపీ వేదికగా రేవంత్రెడ్డి ఎలాంటి కామెంట్లు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.