Home » Bandaru Dattatreya
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమంలో అందరూ ఒక తాటికి వచ్చి కలిసి పని చేసేందుకు ఉపయోగపడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అలయ్ బలయ్ స్ఫూర్తితోనే తెలంగాణ జేఏసీ ఏర్పాటు అయిందని ఆయన గుర్తు చేశారు. అంతకుముందు రాజకీయ నాయకులు విడివిడిగా ఎవరికీ వారు కార్యక్రమాలు నిర్వహించుకునే వారని తెలిపారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆదివారం అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది. ఉదయం 1 0 గంలకు ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ, హర్యానా గవర్నర్లు, వివిధ పార్టీల నేతలు హాజరుకానున్నారు. సినీ ప్రముఖులను కూడా అలయ్ బలయ్ కమిటీ అహ్వానించింది.
సమాజంలో అందరినీ సమైక్యంగా కలుపుకునేవే గణేష్ ఉత్సవాలని హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. కులం, మతం, భాషా. ప్రాంతం అనే తేడా చూడకుండా మనమంతా ఒక్కటే అనే భావన ఉంటుంది అని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ నానక్రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపం తెలిపారు.
బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సోమవారంనాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్లోని రామ్నగర్ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
హరియాణాలో రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తీసుకుంటోంది. కాంగ్రె్సతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీలిక ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ( andaru Dattatreya ) మనవరాలు జశోధర ( Jasodhara ) ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) పై పద్య గానం చేశారు. జశోధర ప్రధానమంత్రి మోదీని ప్రశంసిస్తూ పాడిన ఒక పద్యం వీడియోను బండారు దత్తాత్రేయ తన ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ( KCR ) త్వరగా కోలుకోవాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ( Bandaru Dattatreya ) ఆకాంక్షించారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించిన నేతలు అనుకున్నట్లుగా రాకపోవడంతో ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసి అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్లు చేసేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇన్నీ అటుంచితే..
తెలంగాణలో పర్వ దినాల సందర్భంగా బంధు మిత్రులను కలుసుకునేందుకు ఏర్పాటు చేసే కార్యక్రమం అలయ్ బలయ్. ముఖ్యంగా దసరా పండుగ తదుపరి రోజున బంధుమిత్రులను కలుసుకుని పరస్పర ఆత్మీయాభిమానాలు చాటుకోవడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశం