Home » BJP Candidates
Telangana: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక రేపటి (గురువారం) నుంచి నామినేషన్ల ఘట్టం కూడా మొదలుకానుంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటు తెలంగాణ బీజేపీ మాత్రం నామినేషన్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి సరికొత్త రీతిలో నామినేషన్లను వేయించాలని బీజేపీ నిర్ణయించింది.
‘సీఎం జగన్ (CM JAGAN)... రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తీసుకొని రాలేదు. మరే ఇతర అభివృద్ధినీ చేపట్టలేదు. కానీ, ఆంధ్రప్రదేశ్ను గంజాయి వనంగా మార్చగలిగారు. కొన్ని తరాల యువత నిర్వీర్యం కావటానికి, వారి జీవితాలు నాశనం కావటానికి మాత్రం బాటలు వేయగలిగారు. ఇటువంటి వ్యక్తి నుంచి రాష్ట్రానికి విముక్తి ప్రసాదించాలి. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాం’ అని లోక్సత్తా పార్టీ ఏపీ అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు.
తనకు కేవలం లక్షన్నర రూపాయల కారు మాత్రమే ఉందని చెబుతున్న దయానిధి.. మరి చేతికి రూ.45 లక్షల విలువైన రోలెక్స్ వాచీ ఎలా ధరిస్తున్నారో చెప్పాలని సెంట్రల్ చెన్నై బీజేపీ అభ్యర్థి వినోజ్ పి.సెల్వం(BJP candidate Vinoj P. Selvam) ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్లో(Hyderabad) మూడు ఎంపీ సీట్లపై కమలం(BJP) పార్టీ దృష్టి పెట్టింది. ఈసారి మూడు స్థానాలను కైవసం తీసుకునే దిశగా వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు చోట్ల బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపింది. ముగ్గురు అభ్యర్థులు అప్పుడే విస్తృతంగా తమ నియోజకవర్గాల్లో(Parliament Constituency) పర్యటిస్తున్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఒకసారి..
BJP 4th List: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ(BJP) స్పీడ్ పెంచింది. తమ పార్టీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటికే మూడు విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ.. ఇప్పుడు నాలుగో విడత(BJP 4th List) అభ్యర్థులను ప్రకటించింది. నాలుగో విడతలో 15 మంది ఎంపీ అభ్యర్థుల(MP Candidates) పేర్లను..
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP) తన అభ్యర్థుల మూడో జాబితాను(BJP Third List) విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు(Tamil Nadu) సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. ఇటీవల తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైని..
Andhrapradesh: ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరికి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని సీట్లపై కమలం పార్టీ అభ్యంతరం తెలుపుతున్నట్లు తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) కోసం బీజేపీ (BJP) ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన రెండు జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసింది. మొదటి జాబితాలో (BJP First List) 195 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత 74 మందితో కూడిన రెండో జాబితాను (BJP Second List) రిలీజ్ చేసింది. అయితే.. ఈసారి కొందరు సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టేసి, కొత్త వారికి అవకాశం కల్పించింది.
లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండవ జాబితాను భారతీయ జనతా పార్టీ బుధవారంనాడు ప్రకటించింది. 72 మందితో జాబితా విడుదల చేసింది. నితిన్ గడ్కరి, మనోహర్ లాల్ కట్టార్, అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయల్, తేజస్వి సూర్య వంటి ప్రముఖులకు ఈ జాబితాలో చోటు దక్కింది.
బీజేపీ (BJP) ఇప్పటికే ఈ లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాని (BJP First List) విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 195 మంది అభ్యర్థులతో కూడిన ఆ తొలి జాబితాలో తెలంగాణ నుంచి మొత్తం 9 మంది చోటు సంపాదించారు. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాని (BJP Second List) విడుదల చేసింది.