Home » By Poll results
హిమాచల్ ప్రదేశ్ లోని మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 2, బీజేపీ ఒక సీటు కైవసం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా దేహరా నియోజకవర్గం నుంచి 9,399 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.
దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ శుక్రవారం కొనసాగుతోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు-2024కు ముందు బీజేపీ సారధ్యంలోని ఎన్డీయేపై పోరాటం ఇండియా (I.N.D.I.A) కూటమి అత్యంత కీలకంగా భావిస్తున్న ఈ ఉపఎన్నిక ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది.