Home » CM Chandrababu Naidu
Andhrapradesh: రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. కేబినెట్లో కొత్త మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. వచ్చే నెల 1వ తారీకు నుంచి రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Andhrapradesh: విజయవాడలో అంత పెద్ద వరద వచ్చాక పది రోజుల్లో మళ్లీ నార్మల్ స్థాయికి తేవటం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు వల్లే సాధ్యం అయ్యిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ‘‘ఇది నేను కాదు.. వరదల్లో ఇబ్బందులు పడ్డ ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారు’’ అని అన్నారు.
అమరావతి: ఎన్డీయే కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరి లోనే సీకే కన్వెన్షన్ హాల్లో నాలుగు గంటలకు భేటీ ప్రారంభం కానుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాలక కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
గుజరాత్లోని గాంధీ నగర్లో జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (సోమవారం) సందర్శించారు.
విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 2014లో ఏపీలో సౌర, పవన విద్యుత్ ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ మొదలైందని అన్నారు. గతంలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండేవని చెప్పారు.
Andhrapradesh: విశాఖ స్టిల్ ప్లాంట్ కూడా ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోంది అని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టిల్కు ప్రత్యేకంగా బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘‘మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ స్టీల్ను ప్రైవేటుపరం కాకుండా చూడండి’’ అంటూ డిమాండ్ చేశారు.
విజయవాడలో పరిస్థితి మెరుగుపడిందని మంత్రి నారాయణ తెలిపారు. ఫైరింజన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నామని అన్నారు. మళ్లీ వరద అంటూ తప్పుడు ప్రచారం చేయడాన్ని వైసీపీ కుట్రగా భావిస్తున్నామని అన్నారు. ఈవిషయంపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశామని మంత్రి నారాయణ అన్నారు.
వరదల సమయంలో సీఎం చంద్రబాబు పనితీరు అద్భుతంగా ఉందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలనూ సమన్వయం చేసి వరద బాధితులను ఆదుకున్న తీరుపై దేశవ్యాప్తంగా సీఎంపై ప్రశంసలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగా నష్టాల్లోకి నెట్టి తెగ నమ్మినందుకు కుట్రలు పన్నుతున్నారని, ఇప్పటికే రెండు ప్లాంట్లను మూసివేసి మూడో ప్లాంట్ కూడా ఆపేందుకు చూస్తున్నారన్నారు.