Home » CM Chandrababu Naidu
జగన్ ఐదేళ్ల పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను రాజకీయ పండితులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ తన పద్ధతిని మార్చుకుని.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఎంతోమంది సూచించారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
వరదల కారణంగా దెబ్బతిన్న దాదాపు 400 గ్రామపంచాయతీలకు లక్ష చొప్పున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాయం చేశారని ఎంపీ బాలశౌరి(MP Balasouri) తెలిపారు. గన్నవరం నియోజకవర్గం పరిధిలో 17 గ్రామపంచాయతీలకు ఈరోజు(సోమవారం) చెక్కులు పంపిణీ చేశారు.
వైరల్ ఫీవర్తో బాధపడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఏలేరు వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు సోమవారం నాడు పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించిన పవన్.. గొల్లప్రోలులోని వైఎస్సార్ కాలనీ ముంపు పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు...
వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ.. ఈ రోజును బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మాజీ సీఎం జగన్ రెడ్డి ఒక టెర్రరిస్ట్లా గత ఐదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించారని విమర్శలు చేశారు.
‘ప్రజల కోసమే నా జీవితం మొత్తం పని చేస్తా’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో వరదలపై యుద్ధం చివరి దశకు వచ్చిందని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ యుద్ధం రేపటితో ముగిస్తే.. ఇక ఏపీ పునర్నిర్మాణంపై దృష్టి పెడతామని అన్నారు.
Kadambari Jatwani: బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ.. సంచలన విషయాలను వెల్లడించారు. ఇటీవల విజయవాడకు వచ్చి విద్యాసాగర్పై కంప్లైంట్ ఇచ్చిన ఆమె.. తాజాగా పలు కీలక డాక్యూమెంట్స్ రిలీజ్ చేసింది. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన జత్వానీ..
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అతి ఎక్కువ వరదుల వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్కు వివరించానని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు గవర్నర్ను కలిశారు. వరదలకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సైతం హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆయా జిల్లాల్లో పరిస్థితులపై జిల్లా కలెక్టర్లను, అధికార యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు.
వరదల సమయంలో గండ్లు పూడ్చేందుకు ఏపీ జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అత్యంత క్లిష్టమైన బుడమేరు బ్రీచ్లను పూడ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నాలుగు రోజులుగా మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేష్లు కలిసి దీన్ని పూర్తి చేశారని పేర్కొన్నారు. దీనివల్ల ఇన్ ఫ్లో పూర్తిగా ఆగిందని చెప్పారు.