Home » Crop Loan Waiver
రెండు లక్షల రూపాయలకు పైగా పంట రుణ బకాయిలున్న రైతులకు.. ఆ పైనున్న మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించాలనే యోచనలో ఉంది.
ఆంక్షలుపెట్టి అరకొరగా రుణమాఫీ చేసి అంతా అయిపోయినట్లు రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రమింపచేస్తోందని, అన్నదాతలు బ్యాంకులచుట్టూ తిరుగుతూ పడిగాపులు గాస్తున్నారని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసినప్పటికీ... అర్హులైన తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని ఆయా ప్రాంతాల రైతులు సోమవారం బ్యాంకుల ముందు ఆందోళనకు దిగారు.
అర్హత కలిగిన రైతులందరికీ రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పథకం అమలుకు సాంకేతిక సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని అర్హతలున్న రైతులకు కూడా రుణమాఫీ జాబితాలో చోటు దక్కడంలేదు.
ఏ గ్రామంలో ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారు? రైతుల వారీగా విడుదల చేసిన నిధులెన్ని? మొదటి, రెండో దశల్లో రుణమాఫీ పొందిన రైతుల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. ఏక కాలంలో రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు దశలవారీగా అంటూ మాట మార్చిందని, అది కూడా నామమాత్రంగానే అమలు చేస్తోందని ఆరోపించారు.
Rahul Gandhi: తెలంగాణలో ప్రస్తుతం రైతు రుణాల మాఫీ పండుగ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. తెలంగాణలో రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
రెండో విడత రుణమాఫీకి ముహూర్తం ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీ నగదు బదిలీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఆవరణలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఈ నెలాఖరు (ఎల్లుండి)లోగా రైతులకు రూ.1.50 లక్షల రుణాలను మాఫీ చేసి, తమ నిబద్ధతను చాటుకుంటామని తెలిపారు.
తొలి విడత రుణమాఫీ నిధులను ఈనెల 18 తేదీన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... రెండో విడత నిధులను ఈనెల 31వ తేదీన విడుదలచేసే అవకాశాలున్నాయి. రూ.లక్ష వరకు అప్పున్న రైతులకు రూ. 6,099 కోట్లు విడుదలచేయగా లక్షన్నర వరకున్న అప్పులు మాఫీచేయటానికి మరో రూ.7 వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి.
రుణమాఫీపై రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని, రూ.2లక్షల రుణమాఫీ అందరికీ అవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.