Home » Districts
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఫెసిలిటేషన సెంటర్లలోనే ఓటు వేయాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్ రెవెన్యూ భవనలో నగరపాలిక కమిషనర్ మేఘస్వరూప్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ ఆఫీసర్, డీపీఓ ప్రభాకరరావుతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికల పక్రియలో పోస్టల్ బ్యాలెట్ కీలకమైనదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తామని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయకపోతే ఉద్యోగులకు అవగాహన లేదని, సౌకర్యాలు కల్పించలేదనే అపోహాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అర్హులందరూ పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోవాలని సూచించారు. గతంలో ...
వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అందుబాటులో లేకపోయినా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఇవ్వాల్సిన మాత్రలను.. బయట అమ్ముతున్నారు. ‘అక్కడికి వెళ్లి కొనండి’ అని వైద్యులు రాసిస్తున్నారు. జిల్లాలో క్షయ వ్యాధి బాధితులు మందులను బయటే కొంటున్నారు. ‘ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ఆశయం. ఇంటి వద్దకే వైద్యులను పంపుతాం. మెరుగైన చికిత్స చేయిస్తాం. క్షయ అంతం.. ప్రభుత్వ పంతం’ అంటూ వైద్యశాఖ అధికారులు సైతం ఊదరగొడుతుంటారు.
పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగినా.. ఈ సారి రాష్ట్రంలో జిల్లా స్థానం దిగజారింది. 2023-24 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 30,893 మంది విద్యార్థులు పది పరీక్షలు రాశారు. వీరిలో 25,003 మంది పాసయ్యారు. 80.93 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 24వ స్థానం దక్కింది. పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ సోమవారం విజయ వాడలో విడుదల చేశారు. మార్చి 18 నుంచి 31వ తేదీ వరకూ పది పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణులైనవారిలో ఏకంగా 18,432 మంది ఫస్ట్క్లాస్ సాధించారు.
రాజకీయ విందులో పాల్గొన్న ఉపాధ్యాయులు, ఎస్ఎ్సఏ ఉద్యోగుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కీలక సాక్ష్యాలు లేకుండా చేసినా.. ‘టవర్ డంప్’ ద్వారా డిన్నర్ జరిగిన డాబా ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో కనిపెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎస్పీ ద్వారా విందు జరిగిన ప్రాంతంలో సెల్ఫోన సిగ్నల్స్, కాల్డేటాను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
సీఎం జగన బటన నొక్కి మూడు నెలలు అవుతున్నా పొదుపు మహిళల ఖాతాల్లోకి వైఎస్సార్ ఆసరా సొమ్ము జమకాలేదు. జిల్లా వ్యాప్తంగా 5,190 మహిళా సంఘాలకు ఇప్పటి వరకూ ఒక్క పైసా అందలేదు. ఇవన్నీ ఓసీ, బీసీ సామాజికవర్గ మహిళల గ్రూపులేనని సమాచారం. జిల్లా వ్యాప్తంగా వీరికి రూ.41.36 కోట్లు రావాల్సి ఉంది. డబ్బులు ఎప్పుడు పడతాయో తెలియని దిక్కు తెలియని స్థితిలో మహిళలు ఉన్నారు.
పదో తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పది పరీక్షలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 142 పరీక్షా కేంద్రాల్లో 40,063 మంది రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకూ మూల్యాంకనం నిర్వహించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, పేరుకుపోతున్న బకాయిలపై ఉద్యోగ సంఘాలు స్పందించాలని ఏపీజీఈఏ, ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. వేల కోట్ల బకాయిలపై ఉద్యోగుల్లో ఆందోళన ఉందని అన్నారు. వాటిని ఎలా చెల్లిస్తారో ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నగర శివారులోని ఓ ఫంక్షన హాలులో ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్యవేదిక చైతన్య సదస్సును నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోవాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభ్యర్థులకు సూచించారు. భేషజాలను వీడి, అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని, గెలుపే లక్ష్యంగా పనిచేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతున్నందున.. రానున్న 20 రోజులు మరింతగా కష్టపడాలని అన్నారు. అమరావతిలో జిల్లాలోని పలు నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులకు ఆదివారం ఆయన బీ ఫారాలను అందజేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యచరణ గురించి అభ్యర్థులకు వివరించారు.
ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన..