Home » Districts
ప్రధాన పంటల సాగుకు అదను దాటేవరకూ మొండికేసిన ఆకాశం.. శుక్రవారం రాత్రి కరిగిపోయింది. గంటల తరబడి వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వీధులు, ఇళ్లలోకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అత్యధికంగా పుట్లూరు మండలంలో 138.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఆత్మకూరు 88.2, బుక్కరాయసముద్రం 88, రాప్తాడు 86.4, శింగనమల 85.4, యాడికి 82, కళ్యాణదుర్గం 75.4, నార్పల 70.8, పామిడి 69.4, శెట్టూరు 68.2, ఉరవకొండ 65.8, ...
ఏపీ, కర్ణాటక సరిహద్దులో సీబీఐ సీజ్ చేసిన వాహనాలను కట్ చేసి, విడిభాగాలను చోరీ చేస్తున్న పది మంది శుక్రవారం పోలీసుల చేతికి చిక్కారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో సీబీఐ కొన్నేళ్ల క్రితం ఇనుప ముడిఖనిజంతో పాటు అక్కడి యంత్రాలు, వాహనాలను సీజ్ చేసింది.
ఎస్పీ కేవీ మురళీకృష్ణ బదిలీ అయ్యారు. ఆయనను విశాఖపట్నం 16వ బెటాలియన కమాండెంట్గా బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన ఎస్పీగా వెయిటింగ్లో ఉన్న పి.జగదీశను నియమించారు. 2017 ఐపీఎస్ బ్యాచకు చెందిన జగదీశ కర్ణాటకవాసి. తొలుత చిత్తూరు ఏఎస్పీగా పనిచేశారు. అనంతపురం 14వ బెటాలియన కమాండెంట్గా, పాడేరులో గ్రేహౌండ్స్ కమాండర్గా, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఇటీవల ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆయనను డీజీపీకి రిపోర్టు ..
తుంగభద్ర జలాశయం నిండుకుండగా మారి.. 105.78 టీఎంసీలు నిల్వ ఉండగా.. అనుకోని విపత్తు ఎదురైంది. క్రస్ట్ గేట్ల నుంచి నదిలోకి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో.. ఈ నెల 10వ తేదీ రాత్రి సుమారు 10.30 సమయంలో 19వ క్రస్ట్గేట్ కొట్టుకుపోయింది. విషయం తెలియగానే లక్షలాది ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రైతాంగంలో ఆందోళన, నైరాశ్యం చోటు చేసుకున్నాయి. కొన్ని గంటల వ్యవధిలో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ ...
అన్నిరంగాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. అనంత జిల్లా కేంద్రంలోని పోలీ్స పరేడ్ మైదానంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాలు అట్టహాసంగా కొనసాగాయి. మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్య్రం వచ్చిందని, అలాంటి మహనీయుల స్ఫూర్తితో దేశాభివృద్ధికోసం ముందుకు సాగుదామని తెలిపారు. దేశస్వాతంత్య్రం కోసం ...
తుంగభద్ర డ్యాం నిండింది. దిగువన ఆయకట్టు సేద్యానికి సిద్ధమైంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టానికి చేరుకోవడంతో క్రస్ట్ గేట్ల ద్వారా నదికి వరద నీటిని వదిలారు. ఇంతలో అనుకోని విపత్తు ఎదురైంది. నీటి ఉధృతికి 19వ నంబరు క్రస్ట్ గేట్ ఐదు రోజుల క్రితం కొట్టుకుపోయింది. దీంతో డ్యాం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. వృథాగా దిగువకు పరుగులు తీస్తున్న నీటిని ఆపేందుకు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు, నిపుణులు రంగంలోకి దిగారు. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం మరింత చొరవ చూపింది. క్రస్ట్ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ ...
జిల్లాలోని డ్వామా విభాగంలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీల్డ్లో పనిచేయాల్సిన ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని డ్వామా పీడీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. కానీ జీతాలు మాత్రం ఆయా మండలాల్లో తీసుకుంటు న్నారు. బదిలీలు చేసిన వారు వారికి కేటాయించిన స్థానాలకు వెళ్లరు. సుమారు 30మంది కి పైగా ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పీడీ కార్యాలయంలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా ఇలాగే ఉంది. అలా పని చేస్తు...
అనంతపురం డంపింగ్యార్డ్లో అవినీతి పొగ ఆగడం లేదు. దొంగ బిల్లుల పేరుతో దోపిడీకి తరచూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నగరంలోని గుత్తి రోడ్డులో దాదాపు 13 ఎకరాల్లోని డంపింగ్యార్డ్లో బయోమైనింగ్ ప్రక్రియ నిర్వహించారు. నోవా్సగ్రీన అనే సంస్థ ఈ కాంట్రాక్టు చేపట్టింది. ఏడాదిన్నర సమయానికి రూ.23కోట్ల అంచనాతో పనులు చేపట్టారు. రోజూ 120 టన్నుల చెత్త పోగవుతోంది. 3.32లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ చేయాల్సి ఉంది. కానీ ఆ పని జరగలేదు. ఈ క్రమంలో ఏడాది కంటే తక్కువ సమయంలో మొత్తం వర్క్ పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. చేయకపోయినా రూ.9 కోట్ల పనులకు బిల్లు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదంతా ఎన్నికల ప్రక్రియ ముందు వరకు జరిగిన వ్యవహారం. ఇక్కడితో ఆగలేదు. అవినీతి చేయాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. ...
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కసాపురం, నేమకల్లు, మురడి ఆంజనేయస్వామి ఆలయాల్లో మంగళవారం విశేష పూజలు జరిగాయి. ప్రతి ఏటా శ్రావణమాసంలో శని లేదా మంగళవారం ఒకే రోజు ఈ మూడు ఆలయాలను దర్శించుకోవడం భక్తులకు పరిపాటి. ఈ క్రమంలో ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, నిర్మల్య విసర్జన, విష్ణు పారాయణం, అష్టోత్తర పూజలు ..
జిల్లాలో ఈ పంట నమోదుకు సర్వర్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈనెల 3 నుంచి ఖరీఫ్లో సాగైన పంటల నమోదు ప్రక్రియ మొదలైంది. తొలి రోజు సర్వర్ పని చేసినా ఆ మరుసటి రోజు నుంచి సక్రమంగా పనిచేయడం లేదు. ఈ పంట నమోదు ఆధారంగానే రైతులకు పంట నష్టపరిహారం, పంటల బీమా, ఇతర రకాల పథకాలు వర్తింపజేస్తున్నారు.