• Home » Election Campaign

Election Campaign

BALAYYA : కబ్జాలు, దందాలకు చెక్‌పెడతా

BALAYYA : కబ్జాలు, దందాలకు చెక్‌పెడతా

వైసీపీ ఐదేళ్ల పాలనలో హిందూపురంలో భూదందాలు, కబ్జాలు, అక్రమాలు పె రిగిపోయాయని, వాటికి చెక్‌ పెట్టేది తానే అని టీడీపీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం ప ట్టణ పరిధిలోని కొల్లకుంట, కొట్నూరు, ఇందిరమ్మ కాల నీ, చౌడేశ్వరీ కాలనీ, ఆర్టీసీ కాలనీతో పాటు ముద్దిరెడ్డిప ల్లి, సింగిరెడ్డిపల్లి, మేళాపురం ప్రాంతాల్లో ప్రచారం నిర్వ హించారు. ఎన్టీఆర్‌ ఆశయ సాధనకే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

KALAVA CAMPAIN: సూపర్‌సిక్స్‌ పథకాలతో ఉజ్వల భవిష్యత్తు: కాలవ

KALAVA CAMPAIN: సూపర్‌సిక్స్‌ పథకాలతో ఉజ్వల భవిష్యత్తు: కాలవ

సూపర్‌సిక్స్‌ పథకాలతో రాష్ట్రానికి ఉజ్వలభవిష్యత్తు ఉంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు.

GUMMANURU: వైవీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది

GUMMANURU: వైవీఆర్‌కు ఓటమి భయం పట్టుకుంది

ఎప్పుడు వచ్చామన్నది కాదు.. బుల్లెట్‌ దిగిందా లేదా అన్నది ముఖ్యం. ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డికి ఓటమి భయం పట్టుకుందంటూ మాజీ మంత్రి, గుంతకల్లు నియోజకవర్గం అసెంబ్లీ కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే వైవీఆర్‌పై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మండలంలోని ఖాదర్‌పేట, అనుంపల్లి, కట్టకిందపల్లి, దిబ్బసానిపల్లి, రామగిరి ఎగువ, దిగువతండాలు, రామగిరిలో సోమవారం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామాన ఆయనకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలతో, పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.

AMILINENI: బీటీపీకి నీరు తీసుకువచ్చి ప్రజల రుణం తీర్చుకుంటా

AMILINENI: బీటీపీకి నీరు తీసుకువచ్చి ప్రజల రుణం తీర్చుకుంటా

బీటీపీకి నీరు తీసుకువచ్చి ప్రజల రుణం తీర్చుకుంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. మండలంలోని తూముకుంట, బెస్తరపల్లి, మందలపల్లి, కెంచంపల్లి, కలిగులిమి, అప్పాజీపాలెం, కొలిమిపాలెం. జంబగుంపల తదితర గ్రామాల్లో సోమవారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. టీడీపీ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలలతో ఘన స్వాగతం పలికారు.

KESHAV: పదవుల కోసమే పార్టీలు మారిన విశ్వ

KESHAV: పదవుల కోసమే పార్టీలు మారిన విశ్వ

స్వార్థ రాజకీయాలు, పదవుల కోసం వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి పార్టీలు మారారని, ప్రజలకు చేసిందేమీలేదని టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ అన్నారు. నియోజకవర్గంలోని వెలిగొండ, చిన్నహోతూరు, పెద్దహోతూరు, కొనకొండ్ల గ్రామాలలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాలలో కేశవ్‌కు మహిళలు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు.

AP Election 2024:మరో కుట్రకు తెరదీసిన వైసీపీ

AP Election 2024:మరో కుట్రకు తెరదీసిన వైసీపీ

ఏపీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ (YSRCP) ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు తెరదీసింది. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఇందులో భాగంగానే ప్రతిపక్షాలపై విషం చిమ్మెందుకు ప్రయత్నిస్తోంది.

AP Elections: ఒకరికొకరు ఎదురైన కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి.. నవ్వుతూ కరచాలనం.. ఎక్కడంటే?

AP Elections: ఒకరికొకరు ఎదురైన కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి.. నవ్వుతూ కరచాలనం.. ఎక్కడంటే?

Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో అప్పుడప్పుడు కొన్ని కొన్ని విచిత్ర సంఘటనలు.. అరుదైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. సాధారణంగా ఈ సమయంలో అభ్యర్థుంతా ఎవరికి వారే విడివిడిగా, వడివడిగా ఎన్నికల ప్రచారం సాగిస్తుంటారు. ఈ తరుణంలో ఆయా పార్టీల అభ్యర్థులు సాధారణంగా ఒకచోట కలుసుకోరు. అనుకోని పరిస్థితుల్లో అభ్యర్థులు ఒకరికి ఒకరు ఎదురైనప్పటికీ అవి ఘర్షణలకే దారి తీస్తుంటాయి. అభ్యర్థుల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలు ఎన్నో చూశాం.

Loksabha polls 2024: బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అంతే.. రఘురాంరెడ్డి ఫైర్

Loksabha polls 2024: బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అంతే.. రఘురాంరెడ్డి ఫైర్

Telangana: బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ, ఐటీ రైడ్స్ చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. సోమవారం ప్రసాద్ హైట్స్ రెసిడెంట్స్ (పాత వెంకటేశ్వర థియేటర్) వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి హాజరయ్యారు.

TDP: వైసీపీకి మరో వారం రోజులే సమయం:  వెలగపూడి రామకృష్ణ బాబు

TDP: వైసీపీకి మరో వారం రోజులే సమయం: వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ: రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని విశాఖ తూర్పు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. మత్స్యకారులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

వైసీపీ దగ్గర  దండిగా అడ్డగోలు డబ్బు..

వైసీపీ దగ్గర దండిగా అడ్డగోలు డబ్బు..

అమరావతి: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన డబ్బు వైసీపీకి దండిగా ఉంది. ఎన్నికల్లో మంచినీళ్లలా ఖర్చుపెడుతోంది. కానీ అభ్యర్థులకు పంపించిన కరెన్సీ కట్టలు ఖర్చు చేయకుండా వారు వెనకేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి