Home » Exams
గ్రూప్-1 మెయిన్ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27 దాకా.. వరుసగా ఏడు రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అధికారులు నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల దాకా పరీక్షలు జరుగుతాయి.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను బుధవారం సీఎం రేవంత్రెడ్డి విడుదల చేశారు. పేపర్-1లో 67.13ు, పేపర్-2లో 34.18ు మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో మే 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) పద్ధతిలో టెట్ను నిర్వహించారు.
వైద్య విద్యకు సంబంధించి ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ ఈ ఏడాది ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. నీట్ -2024పై దేశ వ్యాప్తంగా జరుగుతున్న రగడే ఇందుకు కారణం. నీట్ మార్కులపై ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది.
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) పరీక్షల షెడ్యూల్ను టీఎస్పీఎస్సీ(TSPSC) విడుదల చేసింది. పరీక్షలు అక్టోబర్ 21నుంచి 27వరకు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్-యూజీ పరీక్షల్లో నేషనల్ టెస్టింగ్ అథారిటీ (ఎన్టీఏ) గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలయింది. సమయాన్ని నష్టపోయారన్న (‘లాస్ ఆఫ్ టైమ్’) కారణం చూపించి ఎన్టీఏ 1,536 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తును తుది దశకు తెచ్చింది. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించింది.
ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్-2024 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 4, 5, 6, 9, 10, 12, 14 ర్యాంకులతో శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాప్ ర్యాంకుల్లోనూ, టోటల్ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసుకెళ్లింది.
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఆదివారం టీజీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సుమారు 74శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి పరీక్షలో ప్రశ్నలు కొంతమేర సులువుగా ఉన్నాయని అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు.
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు (Group-1 prelims exam) ఇవాళ (జూన్ 9న) ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 31జిల్లాల్లో 4లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.