Home » Flood Victims
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు తమ ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగి బాధితులను కాపాడుతుంటారు. మరికొందరు..
వయనాడ్పై విపత్తు విరుచుకుపడిన వేళ... శాస్త్రవేత్తలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఆంక్షలు విధించడంపై కేరళ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
కుంభవృష్టి కారణంగా సంభవించిన మెరుపు వరదల్లో గల్లంతైన హిమాచల్ ప్రదేశ్లోని మూడు జిల్లాలకు చెందిన 45 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు.
ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో(india) ఏదో ఒక చోట వరదలు(floods), విపత్తులు సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వర్షాకాలంలో అయితే కొండ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో నదులు, వాగులు, జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో యావత్ దేశాన్ని కుదిపేసిన ప్రధాన ఎనిమిది వరదల సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బర్స్టతో కులు, పధార్, మండి, సిమ్లా జిల్లాలను వరద ముంచెత్తింది. 45 మంది గల్లంతవగా.. వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి.
టీవీ ముందు.. సోఫాలో కూర్చున్న ఐదుగురు కుటుంబ సభ్యులు.. కొండచరియల ధాటికి.. అదే సోఫాలో విగతజీవులుగా మారిపోయారు..! భారీ వర్షం, చలిని తాళలేక.. రెండుమూడు బెడ్షీట్లు కప్పుకొని పడుకున్నవారు.. ఆ దుప్పట్ల కిందే మృతదేహాలుగా కనిపించారు..! కొండచరియలు పెళపెళా విరిగిపడుతున్న శబ్దాలు విని.. బయటకు పరుగులు తీయాలనే
‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళ.. ప్రకృతి ప్రకోపానికి గురైంది..! పశ్చిమ కనుమల నడుమ.. తేనీటి తోటలు, ఏపుగా పెరిగే రబ్బరు చెట్లు, చూపరులను ఆకట్టుకునే కొబ్బరి చెట్లతో ఆహ్లాదంగా ఉండే వయనాడ్పై విపత్తు విరుచుకుపడింది..! తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలు.. బురదతో కూడిన వరద.. విరిగిపడ్డ కొండ చరియలు.. వెరసి సోమవారం అర్ధరాత్రి
చిమ్మచీకట్లో కొండచరియలు విరిగిపడి.. నీరు, బురద కలిసి ప్రవాహమై విరుచుకుపడడంతో ఆ ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి! చాలామంది బాధితులు శిథిలాల కింద చిక్కుకుపోయి..
తీరం పొడవునా ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో.. చల్లటి నీటితో అలరారే చలియార్ నది వయనాడ్ విలయం నేపథ్యంలో కన్నీటి కాసారంగా మారింది! ఈ ఉత్పాతంలో ముండక్కై ప్రాంతంలో చనిపోయిన 31 మంది మృతదేహాలు.. చలియార్ నదిలో 25 కిలోమీటర్ల మేర
కేరళలోని వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడి సంభవించిన ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 93కు చేరింది. ఎప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆర్మీతో సహా ప్రకృతి వైపరీత్యాల బృందాలు నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్లలో నిమగ్నమయ్యారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మంగళవారం, బుధవారం రెండ్రోజుల పాటు సంతాప దినాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.