Home » Gnana Maha Yagna Kendram
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ ఆషాఢ మాసంలో పురాణపండ శ్రీనివాస్ ఆర్షధర్మాల రమణీయ గ్రంధాన్ని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. లక్షల కొలది భక్తులకు ఇష్టమైన శ్రీ సహస్రనామాలు రెండింటితో ‘లలిత , విష్ణు’ల వెలుగులతో ముఖపత్రం శ్రీరాజరాజేశ్వరీదేవి మంగళ చిత్రంతో, వెనుక అట్టపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంగళానుగ్రహం కలగాలనే పవిత్ర స్వఛ్చ వాక్యనిర్మాణంతో ఈ గ్రంధం చోటుచేసుకోవడం విశేషం.
పురాణపండ రాధాకృష్ణమూర్తి యజ్ఞమయ సంకల్పం బలమైనది కాబట్టే ఆయన కుమారుడు, ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయధర్మాదాయశాఖ ఆధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ తన తండ్రి మహదాశయాన్ని సరిక్రొత్త పుంతలు తొక్కిస్తూ తెలుగు రాష్ట్రాల ఆలయాల్ని, పీఠాల్ని, మఠాల్ని, వేదపాఠశాలల్ని శ్రీరామరక్షాస్తోత్రమ్ అఖండ మగలా స్తోత్ర వైభవ ప్రచారంతో, ఉచిత పంపిణీతో చుట్టేస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రానికి సమర్ధవంతమైన పాలన అందిస్తారని, అందివ్వాలని కోరుతూ.. ఇటీవల కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ‘జయ జయోస్తు’, ‘నారసింహో ... ఉగ్రసింహో’.. అనే రెండు రమణీయ గ్రంధాలను బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ సన్నిధానంలో మహాత్ములైన చాగంటి కోటేశ్వరరావు వంటి సనాతనధర్మతేజస్సుతో ఆవిష్కరించడం ఎంతో వైభవంతో వేలకొలది భక్తుల్ని ఆకర్షించింది. ఈ రెండు ఆర్ష భారతీయ దివ్య గ్రంధాలకూ పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనకర్త కావడం.. ఈ గ్రంధాలు ఎంతో సౌందర్యంతో రూపు దిద్దుకోవడం ప్రత్యేకంగా పేర్కొనాలి. ఇప్పుడీ అపురూప దైవీయ చైతన్యపు గ్రంధాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాలను ప్రచురించాలని టీడీపీ శ్రేణులు కోరినట్లు సమాచారం.
వారాహి చలన చిత్ర అధినేత, ‘ఈగ - లెజెండ్’ వంటి భారీ చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి ప్రచురించిన పురాణపండ శ్రీనివాస్ అపురూప ఉపాస్య గ్రంధం ‘అమ్మణ్ణి’ గ్రంధాన్నిఆంధ్రప్రదేశ్ ఐ.టి మరియు విద్యాశాఖామంత్రి నారాలోకేష్కు, ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనితకు ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు బహూకరించి ఉజ్వల భవిష్యత్తుకు జయోస్తు పలకడం విశేషం. తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఆలయాలకు శ్రీనివాస్ మహోజ్వల గ్రంధాలను అందించిన సాయి కొర్రపాటికి హిందూపూర్ శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో చాలా ఆత్మీయ బాంధవ్యముందని ఆయన సన్నిహితులు సైతం అమరావతిలో చెబుతున్నారు.
నాల్గవసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని... బుధవారం ఉదయం బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధానంలో పురాణపండ శ్రీనివాస్ రచనలైన మంగళగిరి నృసింహ భగవానునిపై ప్రచురించిన ‘నారసింహో... ఉగ్రసింహో’ దివ్యగ్రంధాన్ని, బెజవాడ కనకదుర్గా శక్తి స్వరూపంపై ప్రచురించిన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని సరస్వతీపుత్రులు, ఉపన్యాస కేసరి చాగంటి కోటేశ్వర రావు ఆవిష్కరించారు. ప్రఖ్యాత వైద్య విజ్ఞాన సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య ఈ సౌందర్య వంతమైన దైవబలాల గ్రంధాలను సౌజన్యభరితంగా సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్కు నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి దంపతుల క్షేమం కోరుతూ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య ప్రచురించిన, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ కలం నుంచి జాలువారిన కస్తూరీ చందనంలాంటి రెండు అపురూప గ్రంధాలు సుమారు ఐదువందల పుస్తకాలు కరకట్ట వద్ద ఉన్న ఉండవల్లిలోని రాష్ట్రముఖ్యమంత్రి నివాసానికి చేరాయి.
దుర్గమ్మకి బొల్లినేని సమర్పించిన పురాణపండ ‘సౌభాగ్య’ మంత్ర పేటికకు అసాధారణ స్పందన వచ్చిందని ఆలయ వర్గాలు ఎంతో సంతోషాన్ని వెలిబుచ్చడం గమనార్హం. ఈ కారణంగా శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం జాయింట్ కమీషనర్ కె.ఎస్. రామారావు, శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయ ప్రధానార్చకులకు వచ్చే సోమవారం ‘శంభో మహాదేవ’ అమోఘ గ్రంధాలను వేలకొలది ప్రతులను శివమయంగా, రుద్రమయంగా బొల్లినేని కృష్ణయ్య అందించనున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
అగ్ర దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా అందించిన మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ భారతీయ చలన చిత్ర రికార్డులను బద్దలు కొట్టుకుంటూ దూసుకుపోయి ఆస్కార్ కైవసం చేసుకుని, కోట్ల మనసుల్ని కొల్లగొట్టిన విషయం ప్రపంచమంతటా తెలుసున్న విషయమే. అయితే ఈ చిత్రం వెండితెరపై పడగానే ప్రత్యేక కృతజ్ఞతలంటూ మొదట కనిపించే ఫోటో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్దే. ఇదేమైనా మామూలు విషయమా? శ్రీనివాస్ నిస్వార్ధ సేవకు, నిష్కపటమైన మనస్సుకూ, నిరంతరం శ్రమించే తత్వానికి, యజ్ఞభావనకూ, అసాధారణ ప్రతిభకు దైవం రాజమౌళి రూపంలో యిచ్చిన కానుకని చెప్పాలి.
జాతీయ స్థాయిలో పేరు పొందిన బొల్లినేని కృష్ణయ్య ఒక చారిత్రాత్మకమైన పవిత్ర కార్యం చేపట్టడం ఇటు రాజకీయ వర్గాల్ని, అటు విజ్ఞుల్ని ఆకర్షించింది. ఈ నెల తొమ్మిదవ తేదీన మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలకు ‘జయ జయోస్తు’ పలుకుతూ రెండు అపురూప మంగళ గ్రంధాలను శరవేగంగా రూపొందింపజేస్తున్నారు. అవే ‘జయ జయోస్తు’, ‘నారసింహో ... ఉగ్రసింహో’.
యుగాల వెనుక... కాలాల వెనుక దైవ బలమేంటో పదునాలుగు లోకాలకీ సాక్షాత్కరింప చేసిన వీర నృసింహ అవతార వైభవాన్ని అక్షరరూపంలో ‘ఉగ్రం ... వీరం’గా వేలాది మందికి అందించడానికే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్తో ఈ అపురూప గ్రంధాన్ని ఇలా కథాకథన వ్యాఖ్యాన వైఖరీ దక్షతతో కూడిన ప్రహ్లాద నారసింహుల రసవత్తర ఘట్టంగా గ్రంథ రూపంలో అందించే భాగ్యం తనకు కలిగిందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ఐ.టి. శాఖామంత్రి, ప్రస్తుత భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు.