Home » Harish Rao
పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉపేక్షించకూడదని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేవరకు ఊరుకోబోమని కంకణం కట్టుకుంది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో నేతలు ఢిల్లీ వెళ్లారు. అక్కడ రాజ్యాంగ నిపుణులు అయిన న్యాయవాదులతో చర్చలు జరిపారు.
న్యూఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పత్రికా ప్రకటనలో పేర్కొ్న్నారు. రాజ్యాంగ నిపుణులతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశం అయింది.
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఆమెను మార్చి 15న తొలుత ఈడీ, అనంతరం ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కారం మెతుకులతో కడుపు నింపుకోవాల్సిందేనా.. మధ్యాహ్న భోజనంలో ఏం పెడుతున్నారు.. పిల్లలకు అందించే మెనూపై ప్రభుత్వం స్పందించాలని మాజీమంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Telangana: సిద్ధిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి పరిస్థితికి సంబంధించి తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ రావు లేఖరాశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ (అనంతగిరి) రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్లు పూర్తిగా నీళ్లు లేక రిజర్వాయర్లు అడుగంటి పోయే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు.
జాబ్ క్యాలెండర్ ఒక పెద్ద జోక్ క్యాలెండర్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. బోగస్ ప్రకటన ఇచ్చి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఎంపికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనతోపాటు ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలూ సభ్యులుగా ఉండే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మభ్యపెడుతోందని.. నిరుద్యోగులకు భయపడి, నాలుగు కాగితాల మీద ఏది పడితే అది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
‘‘నాకు మంత్రి పదవి వచ్చినపుడు ఊరేగింపులో.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా టీఆర్ఎ్సలోనే ఉన్నావ్.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలతో రెండో రోజూ అసెంబ్లీ హోరెత్తింది. గురువారం ఉదయం కేటీఆర్, హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి సభలోకి వచ్చారు.