Home » Kolkata doctor rape-murder case
'స్వాస్థ్య భవన్' ఎదుట నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులపై దాడి జరిపేందుకు కుట్ర జరుగుతోందంటూ తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ సంచలన ఆరోపణ చేశారు.
సీల్దా కోర్టులో శుక్రవారం జరిగిన క్లోజ్డ్ డోర్ హియరింగ్లో నార్కో టెస్ట్కు ఏదైనా అభ్యంతరం ఉందా అని జడ్జి నేరుగా రాయ్ని అడిగారు. అయితే తన సమ్మతిని తెలిపేందుకు రాయ్ నిరాకరించాడు.
నేర తీవ్రత, దానిని కప్పిపుచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, పని ప్రాంతాల్లో భయాలు నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో యావద్దేశం నిష్పాక్షికమైన సత్వర విచారణను కోరుతోందని వైద్యులు తమ లేఖలో రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ప్రాంగణంలో గురువారం ఓ బ్యాగ్ కలకలం సృష్టించింది. సదరు బ్యాగ్ను ఎవరు తీసుకు వెళ్లక పోవడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జాగిలాలతో సహా పోలీసులు ఆర్ జీ కర్ ఆసుపత్రికి చేరుకున్నారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ నివాసంతోపాటు మరో రెండు ప్రదేశాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు నిర్వహించింది. ప్రొ. సందీప్ ఘోష్కు చెందిన రెండు ప్లాట్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది.
ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనపై జూనియర్ డాక్టర్ల నిరసనతో తలెత్తిన ప్రతిష్ఠంభన 33వ రోజైన బుధవారంనాడు కూడా తొలగలేదు. చర్చలకు రావాలంటూ ప్రభుత్వం ఆహ్వానించడాన్ని స్వాగతిస్తూనే మరిన్ని కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఘటనపై వైద్యులు చేపట్టిన నిరసన బుధవారంతో 33వ రోజుకు చేరుకుంది. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఇదే సమయంలో ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు గుర్తించి, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ను అరెస్టు చేసింది.
కోల్కతాలో హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న వైద్యులందరూ మంగళవారం సాయంత్రం 5గంటల్లోగా విధుల్లో చేరాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను జూనియర్ డాక్టర్లు పక్కన పెట్టారు.
ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రయినీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో బాధితురాలికి న్యాయం కోరుతూ నిరసనలకు దిగిన జూనియర్ డాక్టర్లు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ వారు విధుల్లోకి చేరలేదు.
కోల్కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచార ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జరుగుతున్న అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.