Home » Mancherial district
ఆన్లైన్లో రుణాలు ఇస్తామంటూ సెల్ ఫోన్లకు మెసేజ్లు పంపిస్తున్నారు. రుణం తీసుకుంటే వెంటనే మీ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని పేర్కొంటున్నారు. సాధారణ, మధ్య తరగతి ప్రజల అవసరాల కోసం వీటి ఉచ్చులో పడుతున్నారు. వారం, పది రోజుల వ్యవధికే తీసుకున్న రుణానికి అధిక వడ్డీలు కట్టాలంటూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు.
విద్యార్థులకు పురుగుల అన్నం... నీళ్ల పప్పు వడ్డించడంపై బెల్లంపల్లి జూని యర్ సివిల్ జడ్జి ముఖేష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీ బీవీ పాఠశాలతోపాటు ఆదర్శ మోడల్ కళాశాల హాస్ట ల్ను పరిశీలించారు. మోడల్ కళాశాలలో పురుగుల అన్నంతోపాటు నీళ్ల పప్పు వడ్డించడాన్ని చూసి ఆగ్ర హం వ్యక్తం చేశారు.
లక్షెట్టిపేట మున్సిపాలిటీ, మండల పరిధిలోని ఎల్ఎఫ్టీ, బఫర్ జోన్లలో ఉన్న భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్ట వద్దని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలె క్టర్ బొట్లకుంట, ఇటిక్యాల చెరువులను ఆయన పరిశీ లించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎల్ఎఫ్ టీ, బఫర్ జోన్లలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రజలు ఓటరు జాబితాలో ఉన్న తప్పొప్పులను సరి చూసుకోవాలని డీఎల్పీవో ధర్మారాణి పేర్కొన్నారు. శుక్రవారం ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీఓ శ్రీపతి బాపు రావుతో కలిసి రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితాను ప్రదర్శించారు.
మండల కేంద్రంలోని ఊర చెరువు సర్వే శుక్రవారంతో పూర్తయ్యింది. కొంత కాలంగా సర్వే చేసినప్పటికీ హద్దులకు నోచుకోకుండా పోయింది. భీమారం గ్రామానికి చెందిన యువకులు కలెక్టర్కు ఫిర్యా దు చేయడంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వారం రోజుల నుంచి సర్వే పనులు చేసి శుక్రవారం చెరువు హద్దులను ఏర్పాటు చేసి మార్కింగ్ పూర్తి చేశారు.
ప్రైవేట్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ (బోధనా రుసుం) విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్ళుగా ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్ మెంట్, ఉపకార వేతనాలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తు న్నాయి.
మహిళా సాధికా రతతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పాత ఐకేపీ కార్యాలయంలో ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ను కలెక్టర్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థి కంగా అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. గురువారం భీమిని ఉన్నత పాఠశాల, భీమిని, బిట్టూరుపల్లి, మామిడిగూడ, పెద్దపేట, భీమిని ఎస్సీ కాలని, భవిత కేంద్రాలను తనిఖీ చేశారు.
సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ మధ్య ఈ నెల 15న ప్రారంభమయ్యే వందేభారత్ రైలుకు మంచి ర్యాల రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్య క్షుడు రఘునాధ్,మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతలు గురువారం హైద్రాబాద్లో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్కుమార్జైన్కు వినతి పత్రం అందించారు.
మండల కేంద్రంలోని కస్తూర్బా ఆశ్రమ పాఠ శాలను బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి ముకేష్ గురువారం రాత్రి తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు, సిలబస్ అంశాలను తెలుసుకున్నారు. సమస్యలను తెలిపితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జడ్జి పేర్కొన్నారు.