Home » Mancherial
గణపతి నవరాత్రోత్సవాలకు సర్వం సిద్ధమైం ది. శనివారం నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భాగంగా గణపతి ప్రతిమకు భక్తి శ్రద్ధలతో పూజించి అనంతరం నిమజ్జనం చేస్తారు. గణ పతి మండళ్ళను నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలతో నిర్వా హకులు ముస్తాబు చేశారు. జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 9 గం టల నుంచి 12 గంటల వరకు చవితి శుభ గడియలో ఆయా మండ పాల్లో గణపతి విగ్రహాలను నెలకొల్పనున్నారు.
మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో మాట్లాడారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రారంభోత్స వానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి 20 సంవత్సరాల సుదీర్ఘకాలం తరువాత అధికారికంగా ప్రారంభోత్సవం జరగనుంది. 2004 జూలై 28న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్రెడ్డ్ది ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మం డలానికి చెందిన ఆదివాసి గిరిజన మహిళపై అత్యాచారయత్నం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని మండల ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అధ్యక్షుడు కనక జంగు, గోండ్వాన పంచాయతీరాజ్ రాయి సెంటర్ మండల అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్లు డిమాండ్ చేశా రు
ఆదివాసీ గిరిజన మహిళపై అత్యాచారయత్నం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్మాత్మక ప్రాం తాల్లో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పర్యటించారు. ఆదివాసీ గూడాలైన కవ్వాల్, లోతొర్రె, దేవునిగూడ, కిష్టాపూర్ గ్రామాలను సంద ర్శించి ప్రజలు, యువత, ఆదివాసీ నాయకులతో మాట్లాడారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తూ భావి తరాలను తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకే సాధ్యమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి పురస్కరిం చుకుని గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినో త్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జిల్లాలో సోషల్ వేల్పేర్ రెసిడెన్సీ స్కూల్స్లో పని చేస్తున్న పార్ట్టైం, గెస్ట్ ఫ్యాకల్టీ హిందీ-2, ఏసీటీ, పీఈటీ పీడీలు, వాచ్ మెన్లను తొలగించడాన్ని నిరసిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్కు అందించారు. వారు మాట్లాడుతూ మూడు మాసాల నుంచి వేత నాలు రావడం లేదని, ఆకస్మికంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామపంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. పారిశుధ్యం నిర్వహణ సహా ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొద్ది నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల నిలిచిపోవడంతో ఖజానా ఖాళీగా దర్శనమిస్తోంది. ఓ వైపు ట్రాక్టర్ల నెలవారీ కిస్తీలు పేరుకుపోతుండగా, మరోవైపు కార్మికులకు వేతనాలు లేక ఇబ్బందులు తప్పడంలేదు. సర్పంచుల పదవీకాలం ముగియడంంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటిని ప్రణాళికబద్దంగా నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్ర మలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న నీటిని పరిశీలించారు. మంత్రి మాట్లాడు తూ గోదావరి నది పరివాహక ప్రాంంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రాజె క్టు నుంచి ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేస్తున్నారన్నారు.
గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారు మనసు మార్చు కొని గంజాయికి దూరంగా ఉండాలని, లేదంటే పీడీయాక్టు అమలు చేస్తామని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం పట్టణంలో ఇండియన్ రెడ్క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఆనంద నిలయం (వృద్ధులు, అనాథ పిల్లల ఆశ్రమం)లో గంజాయికి అలవాటైన వారితో ఆశ్ర మంలో మొక్కలు నాటించి పరిసరాలను శుభ్రం చేయించారు.