Home » Manipur Violence
మణిపూర్లో హింసపై తప్పుడు, స్పా్న్సర్డ్ రిపోర్టు ఇచ్చారంటూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగేందుకు ఈజీఐ ప్రయత్నించిందని ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆరోపించారు. గిల్డ్ మెంబర్లపై తమ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్నారు.
రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై ఉక్కుపాదం మోపుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం అసెంబ్లీలో..
కేంద్ర ప్రభుత్వంపై ఎప్పుడూ నిప్పులు చెరిగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. తాజాగా మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. 77వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా..
మణిపూర్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. డీఎంకే నాయకురాలు కనిమొళి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. దేశంలో ఎక్కడైనా మహిళలపై..
ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన వీడియో బయటపడినప్పటి నుంచి.. మణిపూర్లో జరిగిన మరెన్నో దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాము న్యాయం చేస్తామని అధికారులు ధైర్యం నూరిపోరవడంతో..
మణిపూర్ హింసాత్మక ఘటనలకు సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ను తప్పించకపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్షా బుధవారంలోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వివరించారు. ఒక ముఖ్యమంత్రి సహకరించక పోతే ఆయనను తప్పించాల్సిన పరిస్థితి వస్తుందని, కానీ మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ పూర్తిగా కేంద్రానికి సహకరిస్తున్నారని చెప్పారు.
ఢిల్లీ: మణిపూర్ హింసాత్మాక ఘటనలపై (Manipur Violence) సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల విచారణతో పాటు బాధితుల సహాయ, పునరావాస పర్యవేక్షణకు ముగ్గురు హైకోర్టు మాజీ మహిళా న్యాయమూర్తులతో ఒక కమిటీని అత్యున్నత న్యాయస్థానం నియమించింది.
మణిపూర్లో పరిస్థితిని తెలుసుకునేందుకు ఇటీవల ఆ రాష్ట్రంలో పర్యటించిన విపక్ష నేతల కూటమి ఇండియా ప్రతినితి బృందంతో సహా 21 మంది ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బుధవారం ఉదయం 11.30 గంటలకు కలుసుకోనున్నారు. మణిపూర్లో పరిస్థితిని రాష్ట్రపతికి వివరించనున్నారు.
మణిపుర్ హింస, మహిళలపై జరిగిన అమానుష ఘటనలపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు రెండవ రోజైన మంగళవారంనాడు కూడా విచారణ కొనసాగించింది. ఒకటి, రెండు ఎఫ్ఐఆర్లు మినహా ఎవరినీ అరెస్టు చేసినట్టు కనిపించడం లేదని, విచారణ నత్తనడకన సాగుతోందని సీజేఐ డీవై చంద్రచూడ్ తో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్లో మహిళలపై మే ప్రారంభం నుంచి జరుగుతున్న అమానుషాలపై ఎన్ని ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారంనాడు నిలదీసింది. ఇళ్ల పునర్మిర్మాణానికి ప్యాకేజీ ప్రకటించారా అని ప్రశ్నించింది.